జాతీయ వార్తలు

వీరప్పన్ పూజించిన గుడికి తాళాలు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: తమిళనాడు, కర్నాటక ప్రభుత్వాలను ఒకప్పుడు గడగడలాడించిన ఎర్రచందనం స్మగ్లర్ వీరప్పన్ బతికి ఉన్నపుడు ఆయన తరచూ పూజించే ఆలయానికి అధికారులు ఇపుడు తాళాలు వేశారు. సేలం జిల్లా మేట్టూరు సమీపంలోని మారియమ్మన్ ఆలయంలో అమ్మవారిని పూజించి ఏదైనా కార్యక్రమాన్ని ప్రారంభించడం వీరప్పన్‌కు అలవాటు. అతని కారణంగా ఆ ఆలయం రెండు రాష్ట్రాల్లో ప్రాచుర్యం పొందింది. గత మంగళవారం ఆ ఆలయంలో ఉత్సవాలు నిర్వహించారు. అయితే, మరోసారి ఉత్సవాలు జరపాలని మరోవర్గం వారు అభ్యంతరం లేవదీశారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. అధికారులు రంగప్రవేశం చేసి ఉద్రిక్తతలను నివారించేందుకు ఆలయానికి తాళాలు వేశారు.