జాతీయ వార్తలు

తెలుగురాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచేందుకు కసరత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీల్లో ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాల సంఖ్యను పెంచే దిశగా కేంద్రం కసరత్తు చేస్తోంది. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మంగళవారం ఉదయం ఇక్కడ న్యాయశాఖ కార్యదర్శితో సమావేశమై ఈ మేరకు చర్చించారు. ఎపిలో అసెంబ్లీ స్థానాల సంఖ్యను 225కు, తెలంగాణలో సీట్ల సంఖ్యను 153కు పెంచేందుకు విభజన చట్టాన్ని సవరించాల్సి ఉందని ఆయన తెలిపారు. ఇందుకు న్యాయపరమైన లాంఛనాలను పూర్తి చేసి హోం శాఖ చట్టసవరణకు బిల్లును ప్రతిపాదిస్తుంది. అనంతరం ఆ బిల్లును లోక్‌సభలో ఆమోదించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు న్యాయశాఖ అధికారులతో చర్చలు జరుపుతున్నట్లు వెంకయ్య తెలిపారు.