జాతీయ వార్తలు

అప్పుడు మీరే అధికారంలో ఉన్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాంగ్రెస్‌కు వెంకయ్య చురక
న్యూఢిల్లీ, డిసెంబర్ 21: ఢిల్లీ క్రికెట్ సంఘం వ్యవహారాలపై సీరియ స్ ఫ్రాడ్ దర్యాప్తు సంస్థ విచారణ జరిపినప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న యుపిఏ ఏం చేసిందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడు ప్రశ్నించారు. మంత్రి సోమవారం లోక్‌సభ జీరో అవర్‌లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీపై కాంగ్రెస్ సభ్యుడు వేణుగోపాల్ చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు. జైట్లీ నిజాయితీ పరుడనేది అందరికి తెలిసిందే, అలాంటి వ్యక్తిపై ఆరోపణలు చేయటం సరైందికాదని అన్నారు. డిడిసిఏపై ఆరోపణలు వచ్చినప్పుడు జైట్లీ మంత్రికాదు, మీరే అధికారంలో ఉన్నారు, ఆయన తప్పు చేసి ఉంటే మీరు ఊరుకునే వారా? అని వెంకయ్యనాయుడు ప్రశ్నించారు. నిరాధారమైన ఆరోపణలు చేసి ప్రతిష్ట దెబ్బతీయటం సమంజసం కాదని ఆయన స్పష్టం చేశారు.