తెలంగాణ

రాజకీయాల్లో ఓర్పు, సహనం అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రాజకీయాల్లో రాణించాలంటే ఎవరికైనా ఓర్పు, సహనం అవసరమని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఇక్కడి మాదాపూర్‌లో శుక్రవారం సాయంత్రం తన గౌరవర్థాం జరిగిన ఆత్మీయసభలో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత రాజకీయాల్లో పరస్పరం మర్యాదలు పాటించాలన్నారు. పెద్దల నుంచి ఎన్నో విషయాలను నేర్చుకున్నందునే తాను జీవితంలా ఇంతగా ఎదిగానన్నారు. రాజ్యసభకు నాలుగోసారి ఎన్నికైనందుకు ఆయనను ఘనంగా సత్కరించారు. కేంద్రమంత్రులు మనోహర్ పారికర్, బండారు దత్తాత్రేయ, ఎపి మంత్రి కామినేని శ్రీనివాస్, ఎంపీ మురళీమోహన్, టిడిపి నేత రేవంత్‌రెడ్డి, సినీ ప్రముఖులు రాజేంద్ర ప్రసాద్, డి.సురేష్‌బాబు, అల్లు అరవింద్, నాగార్జున, కె.రాఘవేంద్రరావు తదితరులు వెంకయ్యను అభినందించారు.