తెలంగాణ
నరసింహన్ను తెలంగాణ గవర్నర్ పదవి నుంచి తొలగించాలి : వీహెచ్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 14 September 2016
హైదరాబాద్: తెలంగాణలో మల్లన్నసాగర్ రైతుల ఇబ్బందులు, రైతుల ఆత్మహత్యలు, పోలీసుల లాఠీఛార్జి, మహిళలపై బలప్రయోగం వంటి విషయాలను కేంద్రం దృష్టికి తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ఎందుకు తీసుకెళ్లలేదని కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు బుధవారం ప్రశ్నించారు. దిల్లీ పర్యటనలో ప్రధాని మోదీని కలిసిన గవర్నర్ ఆంధ్రప్రదేశ్కు ప్యాకేజీ, ప్రత్యేక హోదాలపై సమాచారం అందించారని, తెలంగాణలో రైతుల సమస్యలపై వివరించలేదని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ పక్షపాతిగా వ్యవహరిస్తున్న నరసింహన్ను తెలంగాణ గవర్నర్ పదవి నుంచి తొలగించి, వేరే వ్యక్తిని నియమించాలని డిమాండ్ చేశారు.