జాతీయ వార్తలు

విమానం కోసం కొనసాగుతున్న గాలింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై : అదృశ్యమైన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌ విమానం కోసం మూడోరోజైన అదివారం గాలింపు కొనసాగుతోంది. 5వేల కిలోమీటర్ల పరిధిలో గాలింపు కొనసాగిస్తున్నట్లు ఎయిర్‌ఫోర్స్‌ ప్రకటించింది. అదృశ్యమైన విమానం జాడ కనిపెట్టే అవకాశం 50 శాతమే ఉందని నిపుణులు పేర్కొన్నారు. ఇస్రో సయితం రంగంలోకి దిగింది. విమానం కూలిందని భావిస్తున్న ప్రాంతంలో సముద్రం లోతు మూడున్నర కిలోమీటర్లవరకు ఉంది. దీంతో అన్వేషణ మరింత సంక్లిష్టంగా మారిందని శాస్త్రవేత్తలు అన్నారు. తమిళనాడులోని తాంబరం వైమానిక స్థావరం నుంచి పోర్టుబ్లెయిర్‌కు శుక్రవారం ఉదయం బయలుదేరిన విమానం కొద్దిసేపటికే అదృశ్యమైన సంగతి తెలిసిందే. ఇందులో మొత్తం 29 మంది సిబ్బంది వున్నారు.