వినమరుగైన

కాలాతీత వ్యక్తులు- పి. శ్రీదేవి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదర్శాలు, విలువలులేని తిను, తాగు, సుఖించు! మార్కు సుఖవాదులు- ఈ కాసిన్ని పాత్రలలో అద్భుతమైన హ్యూమన్ డ్రామా నడుస్తుంది నవలలో. మరో ఇన్‌గ్రిడెంట్- క్యారెక్టరైజేషన్ లేదా ఇవాల్యుషన్ ఆఫ్ క్యారెక్టర్స్- ఇందిర అనే అమ్మాయి నవల రెండో పేజీలో పరిచయమైనప్పుడు ఎట్లా మాట్లాడుతుందో- చిట్టచివరి పేజీలోనూ అదే ధోరణి, అదే నిర్భయత్వం, అదే స్వేచ్ఛాప్రియత్వం- ప్రదర్శిస్తుంది. ‘‘ఇంత విశృంఖలత’’అని మనలో కొద్దిమంది- విసుక్కునే పరిస్థితి కొద్ది పేజీల తరువాత కనిపిస్తుంది. ఆమేరకు పురుషవాద అహంకార మనస్తత్వాన్ని ఎక్స్‌పోజ్ చెయ్యటంలో రచయిత సఫలీకృతం అయినట్లే! అయితే అట్లా విసుక్కునే పాఠకుడు ఇందిర వెంట నవల చివరదాకా ప్రయాణిస్తే ఇందిర పాత్రలో ఒక విధమైన రొమాన్సులో పడిపోతాడు. ఆమె స్వేచ్ఛాప్రియత్వానికి ఓపెన్‌నెస్‌కీ, ధీరత్వానికీ విస్మయులవుతాడు! ఒక గొప్ప స్ర్తిమూర్తిని చూసిన అనుభూతి కలుగుతుంది.
మరింత కల్యాణి ‘ఈ కన్నీళ్ళు, ఈ కష్టాలు, ఈ దారిద్య్రం నాకెందుకు దేవుడా!’అంటూ అందమైన సుకుమారమైన ఈ యువతి మనకు బాగా చిరపరిచితమైన స్ర్తి. ఈమె కొంచెం ధైర్యం, కొంచెం గాంభీర్యం చూపితే బాగుణ్ణు- అని నవల చివర్లో అనుకోకుండా ఉండలేం.
కృష్ణమూర్తి మనలోని వాడే. యవ్వన సంధ్యల్లో తప్పటడుగులు వేసినవాడు. కాని స్థిరంగా నిలబడి వెలుగువైపు ప్రయాణించి ఇందిర వ్యక్తిత్వపు ధగధగల్ని చూసి, ఆమె చెయ్యిఅందుకోను సాహసించిన యువకుడు.
పాత్రలు ఎట్లా ఎవాల్వ్ అవుతాయో గమనించాలంటే ఈ కృష్ణమూర్తిని ఫాలో అయితే చాలు.
చివరాకర్న చెప్పుకోవాల్సింది ఆనందరావును - ఆ్దళ ఒకౄఇ్య యచి జూళష్ఘకజశ ౄజజూజూళ ష్ఘఒఒ ఏ విలువలూ, వాధాలూ, ఆశయాలూ లేని కేవలం తన సుఖం, తన వస్తుతౌల్యం మాత్రమే పరమావధి అనుకునే నేటి మధ్యతరగతి ఆది పురుషుడు. అతని సంతతే వందలు, వేలుగా, మిలియన్లుగా దేశం అంతటా వర్ధిల్లుతుంది. ఈ ఆనందరావు గతాన్ని, అతని మనస్తత్వాన్ని పరిశీలిస్తే- ఒక జలదరింపు కలుగుతుంది. ఈ ఆనందరావు మనకో వార్నింగ్.
చివరి ఇన్‌గ్రిడెంట్ నవలలోని ఫిలాసఫీ లేదా సందేశం లేదా నవలా ప్రయోజనం వగైరా, వగైరా-
ఏ సందేశాన్నీ చెప్పకపోవటమే ఈ నవల విశిష్టత! జీవితాన్ని జీవించాలి. ధైర్యంగా పోరాటంగా ‘‘రెక్కలున్నాయని ఎగరడానికి ప్రయత్నిస్తాం. రెక్కలు లేవు మనకు. ఉన్నా అణిగిపోయాయు!’’అన్న వివేచన ‘‘ఏ పనిచేసినా నేను కళ్లుతెరచి చేస్తాను. ఏడుస్తూ ఏదీ చెయ్యను. ఏది జరిగినా ఏడవను’’అనే స్థిర చిత్తాన్ని ‘‘ఏ ఘట్టంలోనూ నా వ్యక్తిత్వాన్ని చంపుకోను!’’అనగలిగే తాత్త్వాక ధీరతా- ఇవాల్టి స్ర్తి నేర్చుకోవాలనే స్ఫూర్తిని అందించే ప్రయత్నం చేస్తుందీ నవల.
వ్యక్తి- ఉన్నతి, మానసిక పరిణితి అనే మాటల్ని కూడ మనం చెప్పుకోవాలి. అట్లాగే ళశజూళూ ఒళశఒజఆజ్పజఆక ళశజూళూ ళజిఖ్ఘజఆక అనే మాటల్ని కూఢా మనం గుర్తుచేసుకోవాలి. యాభై యేళ్లనాటి నవలలో యిన్ని సుగుణాలా అని మనం ముచ్చటపడతాం ఈ నవల చదివిన వెంటనే! ఆ ముచ్చట పడటమే ఈ నవలను గొప్ప నవలల జాబితాలోకి చేర్చింది.
- సశేషం

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

వి. చంద్రశేఖర రావు