వినమరుగైన

ప్రజల మనిషి -వట్టికోట ఆళ్వారుస్వామి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాంప్రదాయక విద్యలకు దూరమైనప్పటికీ లోకానుభవం చేత, విజ్ఞతచేత తాను గ్రహించిన విజ్ఞానాన్ని ఆ వూరి ప్రజల అభ్యున్నతికి వినియోగించటానికి ఆయన సమకడతాడు. ముఖ్యంగా ఇందులో గమనించవలసిన విషయం తెలంగాణ ఉద్యమానికి ఆలంబనమైనటువంటి గ్రంథాలయోద్యమం మనకు అనుశ్రుతంగా కనిపిస్తుంది. నిజామాబాద్‌లో జరపదలచిన గ్రంథాలయ మహాసభలకు నిజాం ప్రభువు అనుమతి నిరాకరించటం దగ్గర నుంచి తన వూళ్లో గ్రంథాలయం అక్కడి పీడిత ప్రజలకు తమ జీవన సమస్యల చర్చలకు కేంద్రం కావటం నుండి చివరికి విజయపతాక కూడా అక్కడే ఎగరవేయటం గ్రంథాలయ ప్రాశస్త్యాన్ని తెలియజేస్తుంది. ముఖ్యంగా తెలుగు ప్రజలో సాంస్కృతిక అణచివేతకు తార్కాణమైనటువంటి ఆ నిజాం పాలనకు వ్యతిరేకంగా వట్టికోట ఆళ్వారుస్వామిగారు తెలుగు ప్రజల సమైక్య సాంస్కృతిక ఉద్దీపనానికి ఈనవల ఒక సాధానంగా వాడారు.
సాహిత్యం సమాజహితాన్ని కోరితే ప్రజల మనిషి ప్రజల సమభ్యున్నతిలో సాహిత్య సాంస్కృతిక పార్శ్వంతోపాటు భూస్వామ్య దోపిడీ నుంచి ప్రజలు విముక్తం కావలసిన అంశాన్ని మరింత స్పష్టం చేసింది. ఇందులో చాలా చాలా ఉపఘట్టాలుగా చెప్పవలసినవి చాలా ఉన్నాయి. ఒకటి పేదవారి యొక్క వారి నిరాశ్రయుతను ఆధారం చేసుకుని వారికి భూమి, పుట్ర, చదువు, ఉద్యోగం ప్రలోభం చూపి వారిని తమ మతంలోనికి మార్చుకోవటానికి ఇత్సే ముస్లిమీన్ అంటే రజాకార్లు చేసిన ప్రయత్నాల్ని చాలా అద్భుతంగా వారు చిత్రించారు. అలాగే క్రైస్తవ మిషనరీలు చేసినటువంటి ఈ మతాంతరీకరణ చర్యలపట్ల కూడా ఒక రకమైనటువంటి ఆక్షేపణను వారు పొందుపరచారు. ఆనాటి నిజాం పాలనలో అన్నివర్గాలవారు కూడా ఎట్లాంటి మినహాయింపు లేకుండా వెట్టి చాకిరీకి లోనైనటువంటి విషయాన్ని వేదాల రఘునాథాచారి గారి భార్య ఆండాళమ్మ దొరవారి ఇంట్లో పెళ్లికి విస్తరాకులు కుట్టడం దగ్గరనుంచి కింది స్థాయి వరకు అందరు ఎలా ప్రతిఫలం లేకుండా పనిచేయవలసి చూపారు.
-సశేషం

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

-సి.రాఘవాచారి