వీరాజీయం
ఆజాద్ కీర్తి! అరుణ్ జైట్లీ అపకీర్తి!!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
‘‘హీరోస్’-2015 అంటూ మోదీజీ పేరు నుంచి భాజపా నాయకుడు సుబ్రహ్మణ్యస్వామి దాకా ఎన్నో పేర్లు వినబడుతూ వున్నా అకస్మాత్తుగా రంగం మీదికి క్రికెటర్ ఎం.పీ. కీర్తి ఆజాద్, అతి సంపన్న అరివీర భయంకర కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీల పేర్లు లైమ్లైట్ ఎత్తుకుపోతూన్నట్లుగా వుంది.
దీని నేపథ్యం కథ అంతా తెలిసినవాళ్లే అందరూ. అంచేత ‘రెడ్డొచ్చె మొదలాడు’ అంటూ- ఆరోపణ, ప్రత్యారోపణలన్నీ ఏకరువు పెట్టను. కానీ, కీర్తి ఆజాద్ని అరుణ్జైట్లీ పార్టీలో ‘ట్రోజన్ హార్స్’అంటూ కీర్తించి- మరింత జారుడు నేలమీదికి జారుకున్నాడనిపిస్తోంది. సస్పెండ్ అయిపోయిన కీర్తిఆజాద్ ‘‘అయ్యా! ఆర్థికమంత్రిగారూ! మీ ‘అఛిల్లిస్ ఫుట్’ సంగతి చూసుకోండి’’- అన్నాడు-
ఐదు కంపెనీలు అక్కడ లేవుగానీ వాటికి జైట్లీగారి హయాంలో (2013దాకా గడిచిన కాలంనాటి డి.సి.సి.ఏ. బాస్) పైసలు వెళ్లాయి అన్నది పెద్ద ‘గూగ్లీబాల్’. ఇవాళ జైట్లీ జట్టు బ్యాటింగ్, ఆజాద్ మద్దతుదార్లు బౌలింగ్ జోరుగా చేస్తున్నారు. సస్పెండ్ అయిన కీర్తికి సస్పెన్షన్ ఒక తురుపుముక్క అయిపోయింది. అరవింద్ కేజ్రీవాల్ ఎంచుకొని కొనుక్కున్న ఐ.పి.ఎల్. జట్టులాగా వున్న రుూ ఆజాద్ టీమ్లో రంగప్రవేశం చేసిన సుబ్రహ్మణ్యస్వామిజీ అమిత్షా వర్గాలకి అరిపాదాల క్రింద మంటగా తయారైనాడు పాపం!
అసలు ‘‘స్వామి’’గారు అడిగిన ప్రశ్న ఒకటి చాలా సెన్సిటివ్గా వుంది. ‘‘్భజపా క్రికెట్ ఆడొచ్చా?’’అన్నది- ‘‘కీర్తి సస్పెన్షన్’’ నోటీసుకి జవాబు రాసి పెడతానన్నాడు శ్రీ సుబ్రహ్మణ్యస్వామి- అవర్ ఘళ్ అరుణ్జీ స్వామి దువ్వగలడా? అన్నది అందరికీ జవాబు తెల్సిన ప్రశ్న. పైగా, అరుణ్జీ ఆర్థికమంత్రి- అయ్యేదాకా ‘కీర్తి’గారు దోబూజులాటకి యింత టైమ్ ఎందుకు తీసుకున్నట్లు? ఇప్పుడు దూకుడు ఏమిటి?
ఈమధ్యకాలంలో ఢిల్లీ అసెంబ్లీ నేరుగా- డి.డి.సి.ఏ. తన పరిధిలోనిదే కనుక- ‘ఎన్క్వయిరీ కమిటీ’ అంటూ తీర్మానం చేసింది. ఇది అలా వుండగా పదవిలో పార్టీలో మంత్రివర్గంలో కూడా ‘‘టాప్’’గా వున్న అరుణ్ జైట్లీకి అర్జెంట్గా కేజ్రీవాల్ మీద- పరువునష్టం దావావేసి తన పరువు ప్రతిష్ఠలను కూడా ‘‘ఓపెన్గ్రౌండ్’’లో పడేసుకున్నాడు.
రాజకీయ రంగంలో కోర్టుల ప్రవేశం సమస్యల్ని మరింత చిక్కుల్లో పడేస్తుంది.
వెనుకటికి ‘‘స్మృతీ ఇరానీగారు- సుష్మాస్వరాజ్గారు మోదీగారి చేయూతతో పులి కడిగిన ముత్యాల్లాగా బయటపడ్డారు తెలీదా?’’ అనడిగాడు ఓ భాజపా బ్యాట్స్మాన్ ధీమాగా.
ఐతే, ‘‘కథ’’రుూసారి యింకా రంజుగా వుంది. పెద్దలతో ఏర్పాటుచేసిన భాజపా ‘‘మార్గదర్శక మండలి’’ కూడా ఆజాద్ తరఫున బౌలింగ్ మొదలెట్టింది. ఆజాద్ ‘మొర’ మేరకు అద్వానీ, జోషీ ప్రభృతులు జోషీగారి యింట్లో- ‘తలలు ఏకంచేసుకుని’’- దర్యాప్తు కమిటీ వేయడం ‘‘బెటర్’’-అంటూ అరిచారు. అయితే రుూ మార్గదర్శక మండలిలో మరో సభ్యుడు అయిన కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ మీటింగ్లో నేడు- అమిత్షా బాహాటంగానే ‘క్రికెట్ స్కామ్’లో- ‘‘అరుణ్కీ జై’’ అంటూన్నాడు- దీన్ని ‘చీలిక’’అనకూడదు లెండి-
ఆజాద్కి మరో వత్తాసు ‘‘పార్లమెంట్’’నే- నడవకుండా నిలవరించిన-‘మాతాపుత్రుల’ పార్టీ కాంగ్రెస్యొక్క వం తపాట వుండనే వుంది. అయితే కాంగ్రెస్ పార్టీ ‘‘కీర్తీ ఆజాద్’’కి నినాదాల సాయమేగానీ యింకో రకంగా ఏ సహాయం చేయలేదు. ఢిల్లీ క్రికెట్ సంఘంమీద చేయబడ్డ ఆరోపణలకి సంబంధించి శ్రీమతి సోనియాగాంధీ వర్గం దగ్గర కీలక సమాచారం ఏదీ లేదు. కాకపోతే కీర్తి అజాద్ సాయంతో అరుణ్జైట్లీ మీద, భాజపా మీదా దుమ్మెత్తిపోయడానికి యిదో అదును అనుకోవాలి.
కీర్తి ఆజాద్ చాలా తెలివైన గేమ్ ప్లాన్ మీద వున్నాడు. అటు పార్టీలోనూ యిటు ప్రతిపక్షంలోనూ కూడా తాను అమాయకుడనని- నేరుగా ఆర్థిక మంత్రి మీద ఆరోపణలు చేయలేదనీ అంటూనే- జైట్లీగారికి ‘‘నషాళాని’’కి అంటేలాగా అవకతవకల జాబితాని పబ్లిక్గా అంటగడుతున్నాడు.
అమిత్షా నేరుగా-‘మేం అరుణ్జైట్లీతో వున్నాం’- అంటూ ప్రకటించడం- కూడా ప్రధాని మోదీకి గొంతులో పచ్చివెలక్కాయ కాగలదు. ఎందుకంటే అరుణ్జీ పరువునష్టం దావావేయడానికి- పార్టీని గానీ, మార్గదర్శక మండలిని గానీ అనుమతి కోరాడా? అన్నది ప్రశ్న- ‘‘కీర్తి’’ని తొందరపడి మెడబట్టి గెంటారా? అన్నది మరో మీమాంస.
నిజానికి ఆదిలోనే మేల్కొని అరుణ్జైట్లీ అమిత్షాని అడ్డం పెట్టుకొని, కీర్తి ఆజాద్ని మానేజ్ చేస్తే యింత అపకీర్తి భారం మోయవలసి రాకపోను. కీర్తి ఆజాద్ చాలాకాలంగా-‘దూకుతా! దూకుతా!’అంటూ బెదిరిస్తూనే వున్నాడు-
కేజ్రీవాల్ తన ప్రిన్సిపల్ సెక్రటరీ మీద కేంద్రం దాడికి ప్రతిగా ‘ఇవాళ నన్ను తగుల్కున్నాడంటున్న ‘‘అరుణ్జీ’’ ఆనుకుని నిలబడ్డ ‘రక్షణ కుడ్యం’ ఎవరు?- ప్రస్తుతం సాక్షాత్తూ- నరేంద్ర దాస్మోదీగారు మాత్రమే అతనికి దన్ను.
‘‘స్మృతీ ఇరానీకి అదనపు బాధ్యతగా- ‘‘ఆర్థికశాఖ యిచ్చేస్తాను, జైట్లీ సాబ్’’ ఆప్హట్ జాయియే’’-అని అంటే?.... ఆయన రష్యా తట్టుకుని, ఢిల్లీకి వస్తున్నాడు. ‘‘్ఢల్లీ శీతువుకి తట్టుకోలేనూ అంటే? జైట్లీ ఫినిష్. వో సోనియా ఫ్యాన్ ఆశ-
అయ్యా! మన ప్రజాస్వామ్యం పార్లమెంటు నడవకనే పటిష్ఠంగా వుంది- ‘కేంద్రమంత్రివర్గం నామ్కే వాస్తే మంత్రులున్నా సాగిపోతుంది’- అన్న సంగతి తెలియదా? అసలు డి.డి.సి.ఏ. అవకతవకలు మహావటవృక్షం భాజపాకి ‘ముసలం’కాగల అవకాశం వుందా? ఇప్పుడు డి.డి.సి.ఏ. స్కామ్ విచారణ మొదలయినా, వో దశాబ్దంపాటు, సోకాల్డ్ దర్యాప్తుల వాయిదాలు సాగవా?- అంతా గందరగోళం-
జస్ట్ నౌ ఇట్ లుక్స్ లైకీ రిడిల్!