వీరాజీయం

మింగలేక, కక్కలేక పాక్ ఆక్రోశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉగ్రవాదుల అడ్డాలమీద మెరుపుదాడి చేసి తగిన శాస్తి చేస్తే అది పాకిస్తాన్‌పై యుద్ధం చేయడం ఎలా అవుతుంది? ఇది ఒక సైనిక ‘శస్తచ్రికిత్స’ మాత్రమే! కీలెరిగి వాత పెట్టమంటూ- దేశం అంతా ఊరీ ఘాతుకం తర్వాత పెడుతున్న గగ్గోలుకి విరుగుడుగా ఒక పకడ్బందీ వ్యూహంతో- ఇండియన్ ఆర్మీ చేసిన వ్యూహాత్మక సైనిక చర్య- తెల్లారేపాటికి దేశం మొత్తంమీద ఒక కొత్త సూర్యోదయంగా భళ్లున భాసించింది. అందరి మొహాల్లోనూ ‘యుద్ధమంటే మాకు భయం లేదు’ అన్న ధీమా, ‘ఉగ్రవాదం మీద ఉక్కుపాదం మోపడానికి నాందీప్రస్తావన జరిగింది’ అన్న భావన కలిగింది. ‘ఉత్త మాటల్ కట్టిపెట్టోయ్.. గట్టి దెబ్బ ఏదయినాన్ చాచి పెట్టి కొట్టి చూపోయ్’ అంటూ ఆవేదన చెందిన సామాన్యుడి గుండె మంట చల్లారింది. ‘ఊరీ’ ఘాతుకం ఒక పిరికిపంద చర్య అయితే, మెరుపుదాడి ఒక వీరోచిత ‘చికిత్స’ మాత్రమే.
ఐక్యరాజ్యసమితి మీటింగ్‌లో ‘మేం కూడా ఉగ్రవాదుల వల్ల యిబ్బందులు పడుతున్నాం’ అన్న పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌కి ‘మేలు’ చేద్దామనే ఈ శస్త్రాస్త్ర సహిత శస్తచ్రికిత్స చేసి- ఉగ్రవాద స్థావరాల్ని పేల్చిపారేసిన ఇండియాని ఏ విధంగా నిందించాలో, ఎలా అంతర్జాతీయ వేదికపై ‘దోషి’గా చూపెట్టాలో అర్థంకాక పాకిస్తాన్- మింగలేక, కక్కలేక ఆక్రోశిస్తున్నది. ‘సరిహద్దుల ఉల్లంఘన’ అన్న ఆరోపణని ఎలా చేస్తుంది పాక్? మూడు కిలోమీటర్లు చొచ్చుకొనిపోయినా, ఎక్కడా ఉల్లంఘన జాడ లేదు. భారతీయ సైన్యం ‘రేఖ’మీద కాలుపెట్టకుండానే తిరిగి ఎగిరిపోయింది. ఈ సంఘటన అనంతరం, ఒకవేళ పాకిస్తాన్ సాయుధ దాడిని చేస్తుందేమోనన్న అనుమానంతో భారత సర్కారు, భారతీయ వేగు సంస్థలు, సైన్యం కూడా ఒక్క ఎల్‌ఓసికి అటూ యిటూ మాత్రమే గాదు- పంజాబ్, రాజస్థాన్ సరిహద్దుల్ని కూడా ఖాళీ చేయించి, అప్రమత్తంగా వుండటం మనం గుర్తించాలి.
ప్రధానమంత్రి నరేంద్రదాస్ మోదీ ఆవేశానికి దాసుడు గాదు- పన్నాగానికీ, పథకానికీ అతని ప్రభుత్వం సదా అప్రమత్తంగా ఉండటానికీ- పఠాన్‌కోట్, ఊరీ సంఘటనల తర్వాత అలవాటుపడిపోయిందీ అనడానికి ‘సర్జికల్ ఆపరేషన్’ చెప్పకనే చెబుతుంది. ముందుగా అంతర్జాతీయ రంగంలో పాకిస్తాన్‌ని ‘ఏకాకి’ని చెయ్యాలన్న ప్రచారాన్ని ఒక లాజికల్ స్థాయితో మోపు చేయడం మోదీ ప్రభుత్వం సాధించిన విజయం. కాశ్మీర్‌లోని పరిస్థితులు, ఆగడాలు- ‘ఊరీ’ అక్రమ దాడిని ప్రేరేపించాయేమోనంటూ అమాయకంగా- తోమిపెట్టిన అంట్ల సిబ్బి మొహం పెట్టుకుని జనాబ్ నవాజ్ షరీఫ్ అన్నాడు. ‘అవునవును.. కాశ్మీర్‌లోని జనహింస, ఆస్తి నాశనకాండ- వీటిని దృష్టిలో పెట్టుకునే, మేం ఉగ్రవాదుల స్థావరాలమీద ‘లోహవిహంగాల’ను ఎగిరించి - పాముల పుట్టలమీదనేగాక, లోపలి సర్పం పడగలమీద చావుదెబ్బతీశాం’ అన్నట్లుంది భారత్ జవాబు. భేష్! మన పోరు ఉగ్రవాదులమీదనే. ఆ మధ్య- భారత్ అనవసరంగా పాకిస్తాన్‌ని రెచ్చగొడుతోంది అన్న కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీయే- తాజా ‘శస్తచ్రికిత్స’ సమాన మెరుపుదాడుల తర్వాత వికసించిన మొహంతో- ‘ఈ విషయంలో మేము కేంద్ర ప్రభుత్వానికి అండగా వుంటాం- జై జవాన్’’ అంటూ ప్రకటించింది. పొరుగుదేశం బంగ్లాదేశ్ తక్షణం స్పందించి పాకిస్తాన్ దుశే్చష్టలకిదే సరియైన ‘ప్రతిచర్య’ అంటూ హర్షించింది.
ఇక్కడ ‘ఉన్న సంగతి’ని జాగ్రత్తగా చూడాలి. ఈ సోకాల్డ్ ఎల్‌ఓసి అంతా భారత భూభాగమైన కాశ్మీర్ ప్రాంతంలోనే వుంది. అటు కూడా పాక్ కబ్జాలో వున్న సోకాల్డ్ అజాద్ కాశ్మీర్ అంతా సమగ్ర భారత్‌లోని భూభాగమేనన్న వాదానికి, ఎట్టకేలకు భారత ప్రభుత్వం మేల్కొన్న సంగతి ఓ రోజుకోరోజు ప్రస్ఫుటం అవుతోంది. ఈ మెరుపుదాడి వెనుక చూస్తే ‘శానా’ తతంగం, సన్నాహం అన్నీ జరిగాయి. క్లుప్తంగా చూద్దాం. మనవాళ్ళు ‘ఉగ్రవాదులను పాకిస్తాన్ తరచుగా పంపించే మార్గాలను’ తరచి చూశారు. నాలుగు ప్రాంతాలు గుర్తుపెట్టుకున్నారు. ధీనికి సంబంధించి దేశ భద్రతా యంత్రాంగం, వేగుల వ్యవస్థ, ఆకాశ భూమార్గాల సర్వే- నైసర్గిక స్థితిగతులన్నీ గప్‌చిప్‌న బేరీజు వేసుకున్నారు. మరోవేపు పాకిస్తాన్ బాయ్‌కాట్ ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తూ వచ్చారు.
2000, 2003 సంవత్సరాలలో యిటువంటి మెరుపుదాడులేవో జరిగినా రుూనాటి ఈ ‘సైనిక సర్జికల్ స్ట్రయిక్స్’ అనబడే శస్తచ్రికిత్సకి మొత్తం సైనిక బలగాలు రెండో కంటికి తెలియకుండా సన్నద్ధం చేయబడ్డాయ్. ఎందుకు? పాకిస్తాన్‌మీద దాడి చేయాలనా? ఎంతమాత్రం కాదండీ.. కాదు! కేవలం ఉగ్రవాదులమీద- అంతా చెబుతూంటారే.. ఆ ఉక్కుపాదం పెట్టి తొక్కేద్దామనే. ప్రపంచం అంతా కోరుకుంటున్నది అదే కదా? అదే మొదలుపెట్టింది ఇండియా. పాకిస్తాన్ కూడా ఓ చెయ్యి వేసి ఉగ్రవాదుల విజృంభణకి ముకుతాడు వేయడానికి పూనుకోవచ్చునుగా? ‘ఉండవయ్యా..! దౌత్యరంగంలో, లౌకిక రంగంలో, సైనిక రంగంలో-యిలా అన్నిచోట్లా ఎదురుదెబ్బలు తగిలి, ముక్కు బజ్జీ అయి, పాకిస్తాన్ ప్రధానమంత్రి షరీఫ్ ఏడుస్తూంటే- ‘చర్చలకు వస్తాం’ అంటూ పాత పాట పాడి చెయ్యందించకుండా- రుూ దెప్పిపొడుపులు, హితబోధలూ ఏమిటి?’ అంటున్నారు పాక్ సానుభూతిపరులు! లెట్ అవర్ నైబర్ రివైజిట్..!