వీరాజీయం

నీవు నేర్పిన విద్యయే ‘నమో’జీ ఇంతలింత కౌగిలింత!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కళ్లల్లో కళ్లు పెట్టి చూడు అన్నాడు ‘రాగా’ (రాహుల్ గాంధీ). వెంటనే- మీరు చూడలేరు సారూ!.. అని కూడా అన్నాడు. ‘నమో’ (నరేంద్ర మోదీ) కితకితలెట్టినట్లు నవ్వాడు. ఈ ‘రాగా’ల, ‘నమో’ల సరాగాలే లేకుంటే- జనాలకి -ఒకరు యాభై నిమిషాలు - జవాబుగా మరొకరు తొంభై నిమిషాలు తాషా మర్ఫా వాయించి పారేస్తారు- బోరుకొట్టి చచ్చేవాళ్ళం.. అన్నాడో టీవీ ప్రేక్షకుడు .. ఆయాచితంగానో- కావాలనో రాహుల్జీ చిన్న ‘ఫన్’ (ఆనక కన్ను కూడా కొట్టాడు అనుకోండి ...లెట్ మి కమ్ దేర్ .. కాస్సేపాగి!) కొట్టాడు .. మన ప్రధానమంత్రి ‘బార్’కెళ్ళినప్పుడు .. సారీ! .. ‘బాహర్కి’ వెళ్ళినప్పుడు -అంటూ నవవుతూ సర్దుకున్నాడు.. బార్ అంటే ఎవరికీ తెలి యదు? .. కాని బాహర్ అన్నది హిందీ మాట -బయటకి అని అర్థం.. బార్- బాహర్‌ల మీద హాస్యరాగాలు పలికించాడు.. ఇందిరా గాంధీ పౌత్రుడు. అయిదుసార్లు ముఖ్యమంత్రి గా హుకుం చలాయించిన ధీశాలి నరేంద్ర దాస్ మోదీగారు- అమిత్ షా అన్నట్లు ‘‘ ఏక చతుర గుజరాతి ‘‘ ( అనలేదా.. షా?.. అనుకున్నడనే అనుకుందాము. ఎందుకంటే ఆతను అంత చతురుడే.. మహా త్మా గాంధీనే అన్నాడుగా.. చతుర బనియాఅని)- ఇప్పుడు దేశసార్వభౌమ్య తుల్య-ప్రధానమంత్రి -సారీ ! మంత్రి అని ఎందుకనాలి ? ఆ ఊత పదం కూడా తీసేసి ఉత్త ప్రధాని అనే అందాము-. మళ్ళీ సారీ -? ‘ఉత్త ‘అన్న మాటమీద ‘ఫన్’ ఉందా? దానినీ -సదరు ఊతపదాన్ని ఏల ఉంచవలె.? తీసెయ్యండి. .. మన ప్రధాని అనండి . ఆయన ఉలిక్కిపడేలా. సార్! నన్ను ప ప్పూ అనండి.. ఇష్టమొచ్చినట్లు తిట్టండి ఏమైనా అనండి -నేను మిమ్మల్ని పల్లెత్తు తిట్టు తిట్టను.. ప్రేమ, అభిమానాలనే ప్రదర్శిస్తాను - అంటూ ‘రాగా’ ఒక్కసారి తన సీటులోనుంచి లేచి వచ్చి -పెద్దాయన గుండె ల్లోకి తలదూర్చి -అక్కున తలా నించి- గాఢాలింగనాన్ని సమ ర్పించి -ద్రోణాచార్యుడికి నమ స్కరించిన ఏకలవ్యుడిలి తిరుగుముఖం పట్టాడు. యాభై ఆరంగుళాల ఛాతీని ఇలా కూడగట్టుకుని. ఇలారావోయ్ అబ్బాయ్... అంటూ ఆప్యాయంగా వెనక్కి పిలిచి - మోదీ రాహుల్‌తో కరచాలనం చేసి పంపేశాడు.. దేశవ్యాప్తంగా -ఈ దృశ్యాన్ని -ఒక అవిశ్వాస తీర్మానంలో భాగంగా - తిలకిస్తున్న ఓటరు మహాశయులులో - చంద్రబాబు వీరాభిమానులు కూడా ఉన్నారు. వారూ కంగు తిన్నారు.
‘అరె తుం తో చుపారుస్తుం నికలారే’ అన్నదో పెద్దావిడ తన టీవీ ముందు కదిలి. చాప కింద నీరులా -తీసిన ఈ దెబ్బ -లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం మబ్బు ని - సంభ్రమాశ్చర్య భరిత నవ్వులతో పేల్చి పారేసింది.. అంతవరకు - ఓకే - కాని ‘పప్పు’ అని మోదీ భక్తుల చేత వేలాకోళం చేయబడుతున్న ప్రతిపక్ష నాయకుడు రాహుల్జీ - ఈ సీన్ తరువాత - అచ్చం ప్రతిపక్ష నాయకుడి లాగే - ఒత్తిడి లేకుండా వెళ్లి కిలకిల కలకలం తరువాత- కూర్చునే ముందు ‘ఇలా ‘కన్ను కొట్టాడు.. ‘సీన్’ చీదేసింది. అక్కడ మళ్ళీ ‘పప్పు’ లో జారి పడ్డాడు. ఓసారి తన పటాలం -దీనితో ఉన్న స్నేహపటాలం -ప్రతిపక్ష సందోహం అందరూ ఇంకోసారి చకితులయ్యేవిధంగా -‘కన్ను గీటాడు..’ మొదటిది -పక్కా ప్లాన్ -కాని రెండోది సీన్ పండించాను అన్న అనం దాతిరేకతలో వెలువడిన అసంకల్పిత- ఏమంటారో దాన్ని.. అది జరిగింది. కాని సభాపతి సుమిత్రా మహా జన్ కూడా అంత నెగిటివ్‌గా స్పందిం చడానికి ఇది అన్‌పార్లమెంటరీ బిహే వియర్ అని ఫీలవడానికి కారణం సామాన్యుడికి మాత్రం అర్థం కాలేదు.
లోక్‌సభ వెలుపల ఉన్న వీరభక్త బృందం కూడా ఎంజాయ్ చేసిన దృశ్యమే ఇది.. భేష్ మగాడివయ్యా వోయ్! రాజకీయ రంగంలో గ్రాడ్యు యేట్ అయినట్లే నువవు.. పులి మీద పుట్ర లాగ అయినావోయ్ .. అంటూ ఘనత వహించిన శివసేన సభ్యులు కూడా -అనక శభాష్లు కొట్టారు. నిజమే - ఆలింగన చుంబానాది విన్యాసాలలో- పబ్లిక్ ఆలింగనమ్ ఒక్కటే మన కల్చర్ అయితే -పార్లమెంటు లోనే కాదు మరెక్కడైనా చుంబనం మాత్రమే నిషిద్ధం. అటువంటప్పుడు కేవలం పెద్దాయనదగ్గరికి - కుర్రవాడు - వెళ్లి అశీస్సులు అందుకున్నాడు అనుకోవచ్చునుగా.. పైగా ఈ ప్రక్రియ కి ఆద్యుడేవరు?.. సాక్షాత్తు నమో సాహెబ్ మాత్రమే.. జవహర్ లాల్ నెహ్రూ ఇలా చేసాడెమో తెల్దు. ఇది కేవలం మోదీగారి ఇనె్వన్షన్. నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా! అన్నట్లు -ఒక ఝలక్ ఇచ్చాడు కాంగ్రేసు చోటేబాబు. అదీ యాభై నిమిషాలు -అదరగొట్టే -లెక్చర్ ఇచ్చి మరీ, -‘బార్’ కి ‘బహార్’ కి మధ్య శే్లష కొట్టి మరీ- నరెంద్రుడ్ని కవ్వించి నవ్విస్తూ -సభని రంజింప చేసినాక - రొప్పకుండా -జంకకుండా రీటేకులు లేకుండా సీన్ పండించాడు. -నేను ‘ప్రేమతో’నే అన్నీ-జయిస్తాను... అని చిరునవ్వును (సినీ భాషలోచెప్పాలంటే) స్క్వీజ్ చేస్తూ వెళ్ళిన రాహుల్ ని వెనక్కి పిలిచి ఈ డ్రామా--బాజీ కి -్ఫనిషింగ్ టచ్ ఇస్తూ, వీపు తట్టి నమోజీ స్కోరు చేసాడు. -అదే స్పిరిట్ తో ఆనక గంటన్నర హస్త విన్యాస -వాగాడంబరాన్ని హిస్ట్రియోనిక్ టాలెంట్ ని ఫుల్ స్పీడ్ లో నమోదు చేశాడు నమోజీ.
కేవలం- ఏపీ సీఎం చంద్రబాబు ఓదార్పు కోసమే ఈ అవిశ్వాస తీర్మానం. సొమ్ము ప్రజలది- సోకు రాజకీయనాయకులది అన్నట్లు సాగ దియ్యబడ్డదే తప్ప- ఏదో మిరకిల్ సంభవించి ఎన్డియే ప్రభుత్వాన్ని కుప్ప కూలుస్తుందని ఎవడూ పగటి కలలో కూడా అనుకోలేదు. కాకపోతే ఈ అవిశ్వాస ప్రహసనం - ఎవవరిమట్టుకి వాళ్లకి, వాళ్ల సత్తా ని తెలుసుకోడానికి పనికి వచ్చింది.. ఇదే సభ చెయ్యిముట్టే సరసాల్ని, బాహాబాహీలను, చిత్రవిచిత్ర వేష గాళ్లని-‘అట్లకర్ర’ల అట్టహాసాన్ని అనుభవించింది, కారాలు, మిరియాలు నూరుతూ- కారంపొడి కళ్ళలో జల్లుకోలేదా? వాకౌట్లు -పార్లమెంటు ప్రాగణంలో పికెట్లు- చిత్ర విచిత్ర పగటి వేషాల విచిత్ర అవాంఛనీయ సన్నివేశాలతో మనం సఫర్ కాలేదా? మోదీగారు విదేశాలకు పోయి మన ప్రధాని హోదాలో -విదేశీ అధినేతల్నీ -ప్రతినిధుల్నీ -గాఢంగా ఆలింగనం చేసుకుంటే - అది ప్రొటోకాల్‌లో భాగం కాలేదా? అని అడిగాడు ఓ కాంగ్రెస్సు వ్యాఖ్యాత.
‘ప్రేమని, సత్యాన్ని పంచుకుంటూ పో’- అన్నది మన అనాది కల్చర్. అత్యంత విజయవంతం గా దీన్ని అంతర్జాతీయం చేస్తూ జేజేలు, హారతులు అందుకున్న నమో ఈభావోద్వేగ ప్రక్రియని మొదట పాకిస్తాన్ ప్రధానితో ప్రారంభిస్తే సుబ్రమణ్యస్వామికి ఆక్షేపణ ఏల రాలేదు? ఒక్క బ్రిటిష్ ప్రధానమంత్రి థెరెస్సా మేని తప్ప అందర్నీ నమో రెండు చేతులూ జాపి -స్వాగత సత్కారాలు చెయ్యడం లేదా? కాకపొతే ఈ అవిశ్వాస తీర్మానం కేవలం టైం పాస్ కాదు- ఎన్‌డీఏకి శివ సేన వార్నింగు బెల్ మరోసారి ఇచ్చింది. మొదట షాని పంపిన మోదీజీ -ఉధ్ధవ్ థాకరే విప్ జారీ చెయ్యంగానే- ‘వాహ్ షా.. !’ అన్నాడ, కాని - ఉద్దావ్ చివర ‘సభ’లో విప్ ని ‘ఒట్టు తీసి గట్టున పెట్టు’ అన్నాడు. అంటే, రేపు శివసేన విడిపోతే? ఎంపీ సీట్లు ఎలా వస్తాయి? ఐక్య సంఘటనలో విభిన్న రాగాలు అపశ్రుతులు -ముక్కు గ్రుద్దినట్లు కనబడుతున్నాయి .. ‘ఆప్’ కావొచ్చు, మరో ‘ఈప్’ కావచ్చు- బిజెపి వ్యతిరేకపవనాలు వీస్తున్నాయి. సోషల్ మీడియా భక్తబృందగానంతో మురిసిపోతే అంతే సంగతులవడానికి - స్కోపు పెరుగుతుంది. ప్రమాద ఘంటికలు చెప్పి మ్రోగవు.. జిఎస్టీని ఎన్నింటి మీద తగ్గించినా, అయ్యవారి లింగం గారు చేసిన తప్పులు దిద్దుకుంటున్నారు అంటారు తప్ప.. ఏలినవారు దయగలవారు అనరు. ఇలా ఆలోచించడం.. ముందుగా ప్రాక్టీసు చెయ్యాలి. కొత్త వంద నోట్లు గులాబీ రేకుల్లగా ఉన్నాయని జనం మురిసిపోవాలా? అవి ఏటీఎం కంతలలో పట్టాలంటే ఏడాది పడుతుందంటున్నారు.. కొన్ని కొత్త సంస్కరణలు ఇలాగే బెడిసికొడుతున్నాయి మరి.
ఉద్ధవ్ థాకరే అన్నట్లు-‘ మేము ప్రజల కలలను పండిస్తామే గాని, మోదీ గారి సొంత స్వప్న సాకారానికి తంటాలు పడం..’ ఇదే మాట ఎన్‌డీఏలోని మిగతా పార్టనర్స్ కూడా అంటే ఎలా? అది మరచి రాహుల్ గాంధీని టార్గెట్ చేసుకొంటేనే 2019 లో గద్దె లభిస్తుందని అనుకుంటే.. అత్యాశే అవుతంది.. దేశంలో చాలాపార్టీలు - అవిశ్వాస తీర్మానం దరిమిలా-పునరాలోచనలో పడుతునాయి -్ఫ్యన్ మెయిల్స్ చూస్తే తెలియదు.. వాస్తవాలు చూడాలి. ఆలింగనం ఖండన మీద - యుద్ధ వ్యూహాలు పన్నితే- ఏటవుద్ది? ... వేరే చోట అవిశ్వాస తీర్మానాలు తల ఎత్తుతాయి. ఎన్నికల పొత్తులు మారిపోతాయి..
‘హగ్లో’మేనియా అండ్ ‘హగ్లో’డిప్లమెసీ మే బూమ్‌ర్యాంగ్!

వీరాజీయం...సెల్: 92900 99512