క్రైమ్/లీగల్

రైలు కింద పడి గిరిజనుడు దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరకులోయ, ఏప్రిల్ 5: మతి స్థిమితం కోల్పోయిన గిరిజనుడు పాసింజర్ రైలు కింద పడి బుధవారం అర్థరాత్రి దుర్మరణం చెందాడు. మండలంలోని పెదలబుడు పంచాయతీ పానిరంగిని గ్రామానికి చెందిన పూజారి నోకుల్‌దాస్ (28) కిరండోలు నుంచి విశాఖపట్నం వెళ్లే పాసింజర్ రైలు కింద పడి మృతి చెందాడు. స్థానిక ప్రభుత్వ నివాసానుబంధ పారిశ్రామిక శిక్షణా సంస్థ ఎదురుగా ఉన్న రైలు పట్టాల వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. గత కొంతకాలం నుంచి మతి స్థిమితం కోల్పోయిన గిరిజనుడు ఇంటి పట్టున లేకుండా విచ్చలవిడిగా తిరుగుతుండేవాడు. గిరిజనుడు రైలు కింద పడి మృతి చెందిన బంధువులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.