విజయవాడ

వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాయకాపురం, జూన్ 10: వైసిపి నేత వంగవీటి రాధ మాట్లాడే ముందుకు అన్ని విషయాలు తెలుసుకుని మాట్లాడాలని తెలుగుదేశం డెప్యూటి ఫ్లోర్ లీడర్ జగదీష్, కార్పొరేటర్లు పైడి తులసి, బుగతా ఉమామహేశ్వరి అన్నారు. వైసిపి నేత రాధ సమావేశమనంతరం సమీపంలోనే ఉన్న తమ టిడిపి కార్యాలయంలో తెలుగుదేశం నేతలు విలేఖరులతో మాట్లాడుతూ తమ పార్టీ కార్పొరేటర్ చెప్పిన మాటల్ని విని రాధ మాట్లాడటం సమంజసం కాదనీ, డివిజన్‌లో ఇళ్లు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేసిన ఘనత వైసిపి కార్పొరేటర్‌దని ఆరోపించారు. ఎమ్మెల్యే ఉమ ఆమె పట్ల అనుచిత వ్యాఖ్యలు ఏమీ చేయలేదని, ఆమె ఎమ్మెల్యేను గౌరవం లేకుండా మాట్లాడిందని ఎదురుదాడికి దిగారు. కార్పొరేటర్ భర్త సైతం కాంట్రాక్టర్ అని, ఆయన నాసిరకం ఇళ్లు రే పథకం కింద కడుతున్నారని విమర్శించారు. ఇంటి కాగితాల్ని తనఖా పెట్టుకుని ఇళ్లు కడుతున్న ఘనత వారిదన్నారు. ప్రజలందరికీ ఎమ్మెల్యే బొండా ఉమ గురించి తెలుసన్నారు. తమ వారి గురించి తెలుసుకుని రాధ మాట్లాడితే మంచిదన్నారు.