విజయవాడ

బస్సుయాత్ర ద్వారా నేరుగా ఉపాధి పనుల పరిశీలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 23: ఉపాధి హామీ నిధులతో వివిధ శాఖల సమన్వయంతో చేస్తున్న పనులను నేరుగా పరిశీలించేలా బస్సుయాత్రను చేపట్టనున్నట్లు కలెక్టర్ బి లక్ష్మీకాంతం తెలిపారు. సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో భాగంగా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి అధికారులతో కలిసి పాల్గొన్నారు. టెలీకాన్ఫరెన్స్ అనంతరం అధికారులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ జిల్లాలో పెద్దఎత్తున ఉపాధి హామీ పథకం కింద వివిధ శాఖల ద్వారా పనులు చేపట్టామని, వీటి పురోగతిని పరిశీలించేందుకు గురువారం బస్సుయాత్ర చేయనున్నట్లు తెలిపారు. గురువారం ఉదయం విజయవాడ నగరంలో అమలు జరుగుతున్న పారిశుద్ధ్య పనులను పరిశీలించిన తరువాత గుర్తించిన రెండు గ్రామాల్లో జరుగుతున్న పంచాయతీ భవన నిర్మాణాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, సీసీ రోడ్లు, శ్మశానవాటికలు, ఆటస్థలాల అభివృద్ధి, వ్యక్తిగత మరగుదొడ్ల నిర్వహణ, సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ కేంద్రాలు, ఉపాధి పనులు జరుగుతున్న తీరును అధికారుల బృందం ప్రత్యేక బస్సులో వెళ్లి పర్యవేక్షించనున్నట్లు కలెక్టర్ వివరించారు. ఈ సమావేశంలో జేసీ-2 పి బాబూరావు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇదిలావుండగా, ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించేందుకు వ్యవసాయ శాఖ రూపొందించిన ప్రత్యేక సీడీని సోమవారం ఉదయం కలెక్టర్ తన క్యాంపు కార్యాలయంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జేసీ-2 పి బాబూరావు, వ్యవసాయ, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

టీడీపీ సీనియర్ నేత ‘కొసరాజు’కు కన్నీటి వీడ్కోలు
* భారీగా పాల్గొన్న అభిమానులు
గుడ్లవల్లేరు, ఏప్రిల్ 23: తెలుగుదేశం పార్టీ సీనియర్, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ కొసరాజు వెంకటాద్రి చౌదరి మరణం పార్టీకి తీరని లోటని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, శాసనమండలి సభ్యుడు బచ్చుల అర్జును డు అన్నారు. ఆదివారం మృతి చె ం దిన వెంకటాద్రి చౌదరికి సోమవారం కన్నీటి వీడ్కోలు పలికారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ల జగన్నాధరావు (బుల్లయ్య), అప్కాబ్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు, గుడివాడ అర్బన్ బ్యాంక్ చైర్మన్ పిన్నమనేని పూర్ణవీరయ్య, గ్రామ సర్పంచ్ వల్లభనేని సుబ్బారావు, మాజీ ఎఎంసీ చైర్మన్ వల్లభనేని వెంకట్రావ్, ఎంపీపీ కొసరాజు విజయ భారతి, పీఎసీఎస్ అధ్యక్షుడు పొట్లూరి రవి కుమార్ తదితరులు శ్రద్ధాంజలి ఘటించారు.