విజయవాడ

కేటరింగ్ పేరుతో అశ్లీల నృత్యాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాయకాపురం, సెప్టెంబర్ 21: ఒక బాలికను క్యాటరింగ్‌లో పనికని చెప్పి వారి తల్లిదండ్రుల అనుమతితో వైజాగ్ తీసుకెళ్లిన నిర్వాహకులు ఆ బాలిక చేత అశ్లీల నృత్యాలు చేయించడంతో ఆమె అక్కడి నుండి తప్పించుకుని అజిత్‌సింగ్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అమ్మాయిలను తరలించి, అశ్లీల నృత్యాలు చేయించే ముఠా గుట్టు రట్టయింది. నిందితుల్ని అరెస్టు చేసిన పోలీసులు అజిత్‌సింగ్‌నగర్ పోలీసు స్టేషన్ ఆవరణలో మీడియా ఎదుట నిందితులను శుక్రవారం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఏసీపీ శ్రావణి మాట్లాడుతూ అజిత్‌సింగ్‌నగర్ న్యూ ఆర్ ఆర్ పేటకు చెందిన 15ఏళ్ల బాలిక 9వ తరగతి వరకు చదివి ప్రస్తుతం ఇంటిలో ఆర్థిక పరిస్థితులు బాగోలేక నగరంలోని వివిధ ఫంక్షన్‌లకు క్యాటరింగ్ పనులకు వెళుతుండేది. ఇదే క్రమంలో స్థానికంగా నివాసముంటున్న షేక్ వౌనికకు సదరు బాలికతో పరిచయం ఏర్పడింది. వైజాగ్‌లో కేటరింగ్ పనులున్నాయని చెప్పి ఈ సంవత్సరం ఆగస్టు 18న బాలికను వెంటపెట్టుకుని రైలులో వైజాగ్ అని చెప్పి అనకాపల్లి తీసుకువెళ్లి పిల్లి సంధ్య అనే ఆమెకు అప్పగించింది. సంధ్య, యాదగిరి మైనర్ బాబు అనే వ్యక్తి సహాయంతో ఆ బాలికను అనకాపల్లిలోని ఒక ఇంటిలో నిర్భందించి కేటరింగ్ పనులు కాకుండా ఫంక్షన్లలో డ్యాన్స్ ప్రోగ్రామ్‌లు చేయాలని బెదిరించారు. వారి ఒత్తిడితో బాలిక అశ్లీల నృత్యాల్ని చేయాల్సి వచ్చింది. ఈ నేపధ్యంలో మైనర్ బాలిక సెప్టెంబర్ 13న అర్ధరాత్రి 12 గంటల సమయంలో అనకాపల్లి నుండి ఆ ముఠా నుండి తప్పించుకుని నగరానికి వచ్చి అజిత్‌సింగ్‌నగర్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ కేసుకు సంబంధించి పోలీసులకు అందిన సమాచారం మేరకు నగర పోలీసు కమిషనర్ ద్వారాకా తిరుమలరావు ఆదేశాలతో నార్త్ ఏసీపీ శ్రావణి నేతృత్వంలో సీఐ ఎంవీవీ జగన్మోహనరావుతో కూడిన నాలుగు బృందాలు ఈ ముఠా గుట్టును రట్టు చేశాయి. ప్రధాన నిందితులైన విశాఖపట్నం జిల్లా చోడవరం మండలానికి చెందిన పిల్లి సంధ్య, విశాఖపట్నం జిల్లా బఓగుల వాడ మండలానికి చెందిన యాదగిరి మైనర్‌బాబులతో పాటు వారికి విజయవాడ నుండి మహిళలను సప్లై చేస్తున్న న్యూ ఆర్ ఆర్ పేటకు చెందిన షేక్ వౌనిక, కోరాడ జ్యోతి, సురఖీనాగదుర్గ, సులకం లక్ష్మమ్మలను శుక్రవారం అరెస్టు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.