విజయవాడ

పొత్తులపై అధిష్టానం నిర్ణయం శిరోధార్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), నవంబర్ 15: ప్రస్తుత రాజకీయ పరిణామాలలో పొత్తులపై ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ తీర్మానించినట్టు డీసీసీ అధ్యక్షుడు ధనేకుల మురళీమోహన్‌రావు పేర్కొన్నారు. గురువారం నగరంలోని ఏపీసీసీ కార్యాలయం ఆంధ్రరత్న భవన్‌లో నిర్వహించిన జిల్లా కాంగ్రెస్ పార్టీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలపై తీర్మానాలు చేశామన్నారు. ఇంటింటి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని మరింత సమర్ధవంతంగా జరపాలని, బుత్‌స్థాయి కమిటీలను బలోపేతం చేసి పార్టీని రానున్న ఎన్నికల్లో విజయబావుటా వైపు పయనింపచేయాలని సమావేశం నిర్ణయించిందన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ, అధికార ప్రతినిధి వింతా సంజీవరెడ్డి, ఆర్‌టీఐ మాజీ కమిషనర్ లాము తాంతియాకుమారి, పీసీసీ నేతలు నరహరశెట్టి నరసింహరావు, రాజీవ్త్రన్, మొగదాటి నాగయ్య తదితరులు పాల్గొన్నారు.