విజయవాడ

గరుడ బస్సులో మంటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 21: విజయవాడ నుండి హైదరాబాద్ వెళుతున్న గరుడ బస్సు వెనుక భాగంలో ఇబ్రహీంపట్నం మండలం జూపూడి గ్రామం వద్ద జాతీయ రహదారిపై గురువారం ఆకస్మికంగా మంటల వ్యాపించాయ అప్రమత్తమైన డ్రైవర్ 28మంది ప్రయాణికులను దించి వేరే బస్సులో హైదరాబాద్ తరలించాడు. అగ్నిమాపక శకటాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు. ఈ ప్రమాదంలో అందరూ సురక్షితంగా బయటపడ్డారు.

కాపు కల్యాణ మండపానికి వంగవీటి రంగా పేరు
పటమట, ఫిబ్రవరి 21: తూర్పు నియోజకవర్గ పరిధిలోని 14వ డివిజన్ రామలింగేశ్వరనగర్‌లో రూ.2కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న కాపు కల్యాణ మండపానికి స్వర్గీయ వంగవీటి మోహనరంగా కల్యాణ మండపంగా పేరు ఖారారు చేసినట్లు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. డివిజన్‌లోని మల్టీ పర్పస్ బిల్డింగ్ ఆవరణలో గురువారం జరిగిన కార్యక్రమంలో స్థానిక నేతలతో కాపు కల్యాణ మండపానికి ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా గద్దె మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 14వ డివిజన్ అభివృద్ధి పథంలో ముందంజలో ఉందన్నారు. గత ప్రభుత్వాలు తప్పిదాలతో అనేక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్న ఈ డివిజన్ సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతో తాను దత్తత తీసుకుని ప్రత్యేక శ్రద్ధతో అభివృద్ధి చేయటం జరుగుతుందన్నారు.