విజయవాడ

నగరపాలక సంస్థ ఎన్నికలకు సిద్ధంకండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 15: రానున్న స్థా నిక సంస్థల ఎన్నికలకు కార్యకర్తలు సి ద్ధం కావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ పిలుపునిచ్చారు. సీపీఐ విజయవాడ నగర సమితి కార్యవర్గ సమావేశం శనివారం హనుమాన్‌పేట, దాసరిభవన్‌లో జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన మా ట్లాడుతూ రాష్ట్రంలో ఏకపక్షంగా ప్రజ లు తీర్పునిచ్చారని అత్యధిక సంఖ్యలో వైసీపీని గెలిపించారని, ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వైసీపీ నిలబెట్టుకునే విధంగా పాలన సాగించాలని కోరారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో క మ్యూనిస్టులకు ప్రజలు పట్టంగట్టాలని, దానికి కార్యకర్తలు సంసిద్ధులు కావాలని కోరారు. సీపీఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ మాట్లాడుతూ ప్రథ మ మేయర్ టీ వెంకటేశ్వరరావు సారథ్యంలో నగరాభివృద్ధి జరిగిందే, తప్ప నేటి వరకు సంపూర్ణంగా అభివృద్ధి జరగలేదన్నారు. కమ్యూనిస్టులను స్థానిక ఎన్నికల్లో ఆదరించి అభివృద్ధికి బాట లు వేయాలని కోరారు. సీపీఐ రాష్ట్ర కా ర్యదర్శివర్గ సభ్యులు జల్లి విల్సన్ మా ట్లాడుతూ అవినీతిలేని పాలన సాగించటం కమ్యూనిస్టులకి మాత్రమే సా ధ్యమన్నారు. జిల్లా కార్యదర్శి అక్కినేని వనజ మాట్లాడుతూ ప్రజల సమస్యల పై పూర్తి అవగాహన ఉన్న కమ్యూనిస్టు లతోనే అభివృద్ధి సాధ్యమన్నారు.