విజయవాడ
25న శ్రీనివాస కల్యాణం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 20 September 2016
విజయవాడ (కల్చరల్), సెప్టెంబర్ 19: స్నేహాలయ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ఈ నెల 25న సాయంత్రం జింఖానా గ్రౌండ్స్లో శ్రీనివాస కల్యాణం జరుగుతుందని సంస్థ అధ్యక్షుడు యాంపాటి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ మండలి వ్యవస్థాపక కన్వీనర్ మందలిపర్తి సత్యశ్రీహరి పర్యవేక్షణలో శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి మంగళా శాసనాలతో శ్రీ సంపత్ కుమార రామానుజ జీయర్ స్వామి, శ్రీ అహోబిల రామానుజ జీయర్ స్వామి, శ్రీ సత్యానంద భారతీస్వామి కల్యాణ క్రతువును జరిపిస్తారని తెలిపారు. భగవద్భక్తులంతా వచ్చి శ్రీనివాసుని అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరారు.