కృష్ణ

‘పేట’ యార్డ్ చైర్మన్‌గా మల్లెల గాంధీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగ్గయ్యపేట, మే 13: జగ్గయ్యపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా సీనియర్ నేత మల్లెల గాంధీని ఎంపిక చేసినట్లు మాజీ మంత్రి నెట్టెం రఘురాం, ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ ప్రకటించారు. శుక్రవారం సాయంత్రం పట్టణంలోని మాజీ మంత్రి నెట్టెం రఘురాం నివాసంలో జరిగిన తెదేపా ముఖ్య నేతల సమావేశంలో మల్లెల గాంధీ పేరును చైర్మన్‌గా ప్రకటించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి నెట్టెం రఘురాం, ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ మాట్లాడుతూ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎంపిక ఆలస్యం కావడంతో అనేక వ్యాఖ్యలు, సందేహాలు వ్యక్తం అవుతున్నాయన్నారు. సీనియర్ నేత మల్లెల గాంధీని చైర్మన్ పదవికి ఎంపిక చేసినట్లు తెలిపారు. మరో సీనియర్ నేత కట్టా నర్శింహారావు పేరు పరిశీలించినా ఆయనకు రెండవ విడత అవకాశం కల్పించాలని తీర్మానించామని ఈ సందర్భంగా నేతలు తెలిపారు. ఈ సమావేశంలో చైర్మన్‌గా ఎంపికైన గాంధీకి శుభాకాంక్షలు అందజేశారు. త్వరలోనే కమిటీని ప్రకటిస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో నేతలు తొండపు జగన్మోహనరావు, కనపర్తి వెంకటేశ్వరరావు, యలమంచిలి రాఘవ, మేకా వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.