విజయవాడ

దుర్గమ్మ సేవలో తమిళనాడు సిఎం పన్నీర్ సెల్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రకీలాద్రి, జనవరి 12: ఇంద్రకీలాద్రి పై కొలువై ఉన్న ఆదిపరాశక్తి శ్రీకనకదుర్గమ్మను గురువారం సాయంత్రం తొలిసారిగా తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం దర్శించుకొని ప్రత్యేక పూజలను నిర్వహించుకొని మొక్కుబడులను చెల్లించుకున్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఘంట శ్రీనివాసరావుతమిళనాడు ముఖ్యమంత్రిని స్వయంగా వెంటబెట్టుకొని అమ్మవారి సన్నిధికి తీసుకొచ్చారు. అమ్మవారి రాజగోపురం వద్ద ఆలయ ఇవో ఎ సూర్యకుమారి ఆధ్వర్యంలో అర్చకులు అమ్మవారి రాజగోపురం వద్ద ముఖ్యమంత్రికి ఆలయ మర్యాదలతోస్వాగతం పలికి అంతరాలయంలోనికి తీసుకువెళ్ళి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి దర్శనం తర్వాత అమ్మవారి ఆశీర్వాద మండపంలో తమిళనాడు సియంకు ఆలయ ప్రధాన అర్చకులు అమ్మవారి దివ్య అశీస్సులను అందచేయగా ఇవో ఎ సూర్యకుమారి సియంకు అమ్మవారి శేష వస్త్రం, అమ్మవారి ప్రత్యేక ప్రసాదాలను అందచేశారు.