విజయవాడ

ఆర్టీసి బస్సు ఢీకొని వ్యక్తి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), మే 19: ఆర్టీసి బస్సు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం రైల్వేస్టేషన్ సమీపంలోని పార్శిల్ కార్యాలయం గేటు సమీపంలో గురువారం ఉదయం రోడ్డు దాటుతున్న సుమారు 45ఏళ్ల వయస్సు కలిగిన గుర్తు తెలీని వ్యక్తిని వేగంగా దూసుకువచ్చిన ఆర్టీసి బస్సు ఢీకొట్టింది. ఈఘటనలో తీవ్రంగా గాయపడిన సదరు వ్యక్తి మృతి చెందాడు. సమాచారం అందుకున్న సత్యనారాయణపురం పోలీసులు సంఘటనాస్థలాన్ని చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుని వివరాల కోసం ఆరా తీస్తున్నారు.