విశాఖపట్నం

పార్టీ బలోపేతానికి కృషి చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాజువాక, సెప్టెంబర్ 8: గ్రామ స్థాయి నుండి పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కష్టించి పని చేయాలని బిజెపి జాతీయ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధ్రీశ్వరి అన్నారు. ఉక్కునగరం గురజాడ కళాక్షేత్రంలో గురువారం విశాఖ రూరల్ జిల్లా 9నియోజక వర్గాల పతాధికారుల శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ శిక్షణ తరగతులను ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వాడవాడలా ప్రచారం చేయాలన్నారు. కేంద్రం రాష్ట్రానికి అందిస్తున్న నిధులు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై కార్యకర్తల్లో అవగాహన కలిగి ఉండాలని సూచించారు. రాష్ట్ర విభజన జరిగినప్పటికీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను దేశ ప్రధాని నరేంద్ర మోదీ అమలు చేస్తున్నారని అన్నారు. అయినప్పటికీ కొన్ని రాజకీయ పార్టీలు అస్థిరతకు పాల్పుడుతున్నాయని, ఈ విషయంలో కార్యకర్తలు అప్రమత్తంగా ఉంటే తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, విశాఖ పార్లమెంటు సభ్యుడు కంభంపాటి హరిబాబు మాట్లాడుతూ పార్టీ ఆశయాలను, సిద్ధాంతాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకు వెళ్లాలన్నారు. శిక్షణ తరగతుల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా పార్టీ నియమాలకు కట్టుబడి ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షులు బి.నాగేంద్ర, మహిళ విభాగం అధ్యక్షురాలు తోట విజయలక్ష్మి తదితర నాయకులు పాల్గొన్నారు.