విశాఖపట్నం

14న పుష్కరిణికి పుణ్యనదీ హారతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింహాచలం, నవంబర్ 8 :రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయశాఖ ఆదేశాల మేరకు ఈనెల 14వ తేదీ కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారి వరాహ పుష్కరిణీకి పుణ్యనదీ హరతి ఇవ్వనున్నట్లు దేవస్థానం అధికారులు నేడొక ప్రకటనలో తెలియజేసారు. కొండ దిగువ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయం నుండి ఉత్సవమూర్తులను ఆరోజు సాయంత్రం నాలుగున్నర గంటలకు పుష్కరిణీకి తోడ్కొని వస్తామని అధికారులు తెలిపారు. అయిదిన్నర గంటలకు సంప్రదాయ పూజలు నిర్వహించి నక్షత్ర, కుంభ హారతులను స్వామివారికి, పుష్కరిణీకి సమర్పించడం జరుగుతుందని అధికారులు తెలియజేసారు. భక్తులు హారతులిచ్చుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నామని, సామగ్రి అంతా దేవస్థానం ఉచితంగా అందజేస్తుందని అధికారులు పేర్కొన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పుష్కరిణీకి తరలివచ్చి, హారతులిచ్చి భగవంతుడి కృపకు పాత్రులు కావాలని అధికారులు ప్రకటనలో తెలియజేసారు.