విశాఖ

బిజెపి ఎమ్మెల్సీ అభ్యర్థి మాధవ్‌ను గెలిపించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కె.కోటపాడు, మార్చి 7: ఉత్తరాంధ్ర అభివృద్ధి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతోనే సాధ్యమని అందుకు బిజెపి ఎమ్మెల్సీ అభ్యర్థి పివిఎన్ మాధవ్‌కు తొలి ప్రాధాన్యత ఓటు నివ్వాలని అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు కోరారు. మంగళవారం ఆయన మండలంలోని కింతాడ గ్రామంలో గంగాదేవి పండుగ సందర్భంగా సర్పంచ్ బండారు అరుణకుమారి, నర్శింహనాయుడు ఇంటికి విచ్చేసారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేఖరులతో మాట్లాడారు. అధికారంలో వున్న పార్టీల అభ్యర్థి గెలిచినప్పుడే ఏవైనా సమస్యల పరిష్కారంతోపాటు అభివృద్ధికి ఆస్కారముంటుందని పట్ట్భద్రులైన వారికి తెలిసిన విషయమేనన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రధానమంత్రి నరేంద్రమోడీ దేశాభివృద్ధికి శక్తివంచన లేకుండా పనిచేస్తున్నారని మాధవ్‌ను ఒకటి ప్రాధాన్యత ఇచ్చి వారికి మద్దతు నీయాలని విద్యావంతులకు కోరుతున్నట్లు తెలిపారు. మాడుగుల మాజీ ఎమ్మెల్యే రామానాయుడు, సర్పంచ్ అరుణకుమారి నర్శింహనాయుడు పాల్గొన్నారు.