విశాఖ

ఎట్టకేలకు కొలిక్కి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 17: జివిఎంసి పారిశుద్ధ్య విభాగంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తూ ప్రమాదవశాత్తూ మృతి చెందిన ఉద్యోగి అప్పలకొండ కుటుంబానికి రూ.8 లక్షల పరిహారం ఇచ్చేందుకు అంగీకారం కుదిరింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీలో పేరుకుపోయిన చెత్తను తొలగించేందుకు దిగిన కార్మికుడు ఊపిరాడక చనిపోయిన సంగతి విధితమే. మృతుని కుటుంబీకులు, జివిఎంసి కార్మిక సంఘాలు బాధిత కుటుంబానికి పరిహారం కోరుతూ పెద్ద ఎత్తున ఆందోళన జరిపారు. మూడు లక్షల పరిహారం ఇచ్చేందుకు జివిఎంసి అంగీకరించినప్పటికీ కుటుంబీకులు నిరాకరించారు. దీంతో మృతుని కుటుంబానికి రూ.8 లక్షల పరిహారం, ఔట్ సోర్సింగ్ ఉద్యోగం, జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం ఇల్లు ఇచ్చేందుకు అధికారులు అంగీకరించడంతో కార్మికులు, మృతుని కుటుంబీకులు ఆదివారం రాత్రి ఆందోళన విరమించారు.