విశాఖపట్నం

రీడింగ్ రూం జ్ఞాపకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ఆంధ్ర సాహిత్యంలో నండూరి వెంకటసుబ్బారావు ‘ఎంకిపాటలు’కు విశిష్ట స్థానం ఉంది. 1953 మే 31న ఆయనను విశాఖ రచయితల సంఘం ఆహ్వానించింది. సాయంత్రం హిందూ రీడింగ్ రూంలో సభ జరిగింది. సుబ్బారావు తన ప్రసంగంలో కొన్ని ఎంకిపాటలను వినిపించారు.

* 1953 సెప్టెంబర్ 15న సాయంత్రం కొత్త తరహా సాహిత్య సభ జరిగింది. లండన్‌లో ఉంటున్న గూటాల కృష్ణమూర్తి నిర్వహించారు. ఆ రోజుల్లో శరత్‌బాబు బెంగాలీ నవలలకు తెలుగు అనువాదాలు చాలా ప్రచారంలో ఉండేవి. ఆ రోజు జరిగిన శరత్‌బాబు జయంతి సభకు బెంగాలీలు ఎక్కువ సంఖ్యలో హాజరయ్యారు. వీరిలో మహిళలూ కూడా ఉండడం విశేషం. ఎవిఎన్ కాలేజీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్ పాండురంగారావు ఆ సభకు అధ్యక్షత వహించారు. మూడు భాషాల్లో ఉపన్యాసాలు సాగాయి. మల్లాది వసుంధర, మసునా, అంగర సూర్యారావు తెలుగులోనూ, బెనర్జీ, మరొక రచయిత బెంగాలీలోనూ, పాండురంగారావు, ఇంకొకరు ఆంగ్లంలోను మాట్లాడారు.

* ఇదే ఏడాది డిసెంబర్ 23న మరో సాహిత్య సభ జరిగింది. పుట్టపర్తి నారాయణాచార్యులు తమిళ, కన్నడ, తెలుగు సాహిత్యాల గురించి మాట్లాడారు.

* స్వాతంత్య్ర సమరయోధుడు వావిలాల గోపాలకృష్ణయ్య అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనడానికి వచ్చి విశాఖపట్నంలో బసచేశారు. విశాఖ రచయితల సంఘం ఆహ్వానం మేరకు 1954 మే 27న సాయంత్రం సభ జరిపారు. పురిపండ అప్పలస్వామి సభాధ్యక్షుడు. గోపాలకృష్ణయ్య ఉపన్యాసం శ్రోతలను ఆనందపరిచింది.

* 1954 ఆగస్టు 19వ తేదీన శ్రీశ్రీ ఏదో పనిమీద మద్రాసు నుంచి విశాఖ విచ్చేశారు. వచ్చీ రావడంతోనే రీడింగ్ రూంకు వచ్చి పురిపండా ఎక్కడ అంటూ అంగర సూర్యారావుని అడిగారు. అప్పటికప్పుడు అందుబాటులో ఉన్న పదిమంది రచయితలతో ఇష్టాగోష్ఠి ఏర్పాటు చేశారు. శ్రీశ్రీ తాను రాసిన ‘సిపాయి చిన్నయ్య’ కథ చెప్పాడు.

* అదే ఏడాది అదే నెల 22తేదీ ఆదివారం ఉదయం రాచకొండ విశ్వనాథ శాస్ర్తీ అధ్యక్షతన సారస్వత సభ జరిగింది. శ్రీశ్రీ తన ఉపన్యాసంలో రచయితల బాధ్యత గురించి, కష్టసుఖాల విషయమై మాట్లాడారు. అంగసూర్యారావు, కృష్ణారావు, బలివాడ కాంతారావుతోపాటు పలువురు మాట్లాడారు.

* చంద్రసేన నాటకానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ఈ సందర్భంగా 1979 ఫిబ్రవరి నాలుగోతేదీన నాటక రచయిత అంగర సూర్యారావుకు రాచకొండ విశ్వనాథ శాస్ర్తీ అధ్యక్షత అభినందన సభ జరిగింది.

* ‘శంకరాభరణం’ సోమయాజులుకు కూడా ఇక్కడే ఘన సత్కారం జరిగింది. ప్రముఖ కవులు, రచయితలు శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్ర్తీ, అరుద్ర, చాసో, రోణంకి అప్పలస్వామి వంటివారికి రీడింగ్ రూంతో ప్రత్యేకమైన అనుబంధం ఉన్నది.