విశాఖ

47కిలోల గంజాయి స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చోడవరం, సెప్టెంబర్ 25: ఏజెన్సీ ప్రాంతం నుండి అనకాపల్లికి వేర్వేరు మార్గాల్లో గంజాయిని అక్రమ రవాణా చేస్తున్న నలుగురు నింధితులను పోలీసులు అరెస్టు చేసి 2.35వేల రూపాయల విలువ చేసే 47కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలిలావున్నాయి. తమిళనాడుకు చెందిన ముత్తుస్వామి, రాజుషెల్లంలు చింతపల్లి మండలం గునిసింగి గ్రామానికి చెందిన గాలి సత్యనారాయణ వద్ద 20కిలోల గంజాయిని కొనుగోలు చేసి గోనెసంచిలో ఉంచి మోటార్ సైకిల్‌పై తరలిస్తుండగా గౌరీపట్నం జంక్షన్ వద్ద పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించి పట్టుకున్నారు. వారి వద్దనుండి గంజాయితోపాటు బైక్‌ను, సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే మహారాష్టక్రు చెందిన అజయ్‌ఖాన్, ముజీఫ్‌ఖాన్‌లు జి.మాడుగుల మండలం పరదేశిపుట్టులో 1.37లక్షల విలువ చేసే 27కిలోల గంజాయిని కొనుగోలు చేసారు. పాడేరు నుండి విశాఖపట్నంలో వెళ్లే ఆర్టీసి బస్సులో క్యారీబ్యాగులో తరలిస్తుండగా పోలీసులు కాంప్లెక్స్ వద్ద మాటువేసి పోలీసులు బస్సు దిగిన వారినుండి గంజాయితోపాటు మూడు సెల్‌ఫోన్లు, ఏడువేల రూపాయల నగదు స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేసారు.