విశాఖ

వంతెన పేల్చివేతకు రెక్కీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీలేరు, అక్టోబర్ 17: ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టు మిలీషియా సభ్యులు అత్యంత గోప్యంగా జాన్‌బాయ్ వంతెన పేల్చివేతకు ప్రణాళిక రూపొందిస్తూ వంతెన వద్ద తిరుగుతుండగా అది గమనించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. మావోయిస్టులు గతంలోనే జాన్‌బాయ్ వంతెన పేల్చిన విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితమే మావోయిస్టులు దారకొండలో సెల్ టవర్ దగ్ధం చేశారు. అనంతరం కోరుకొండ ఒక వ్యాపారిని కూడా హత్య చేశారు. అనంతరం ఎ. ఓ.బి.లో మావోయిస్టులు పోలీసులపై దాడులకు తెగబడుతూ తాజాగా జాన్‌బాయ్ వంతెనను మావోయిస్టు మిలీషియా సభ్యులతో రెక్కీ నిర్వహించి పేల్చివేతకు సన్నాహాలు చేస్తున్నారనే సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగి మిలీషియా సభ్యులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా జోడంబో అటవీ ప్రాంతంలో బి.ఎస్.ఎఫ్ జవాన్లకు ఆహార పదార్థాలను ఒక ప్రత్యేక వాహనంలో తరలిస్తుండగా మావోయిస్టులు హైజాక్ చేసి ఆహార పదార్థాలను అపహరించుకుపోయారు. ఈ సందర్భంగా వాహనడ్రైవర్‌కు ఎటువంటి హాని తలపెట్టలేదని పోలీసు వర్గాలు తెలిపాయి. సరిహద్దుల్లో పోలీసులను లక్ష్యం చేస్తున్న మావోలు ఎటువంటి చర్యలకైనా వెనుకాడరని పోలీసులు భావిస్తూ మరింత అప్రమత్తం అయ్యారు. రామ్‌గూడ ఎన్‌కౌంటర్ నిరసనగా మావోయిస్టులు దాడులకు పాల్పడుతుండడంతో ఎప్పుడేం జరుగుతోందనని గిరిజనులు భయాందోళన చెందుతున్నారు.