విశాఖ

ఆటోను ఢీకొన్న ఆర్టీసి బస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నక్కపల్లి, అక్టోబర్ 22: మండలంలోని వెదుళ్లపాలెం జంక్షన్ వద్ద గల జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. అమలాపురం నుండి విశాఖపట్నం వెళుతున్న ఆర్టీసి సూపర్ లగ్జరీ ఎక్స్‌ప్రెస్ బస్సు అదే రహదారిలో ఎదురుగా వెళుతున్న సిల్వర్ సామాన్ల ఆటోను ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ సంఘటనలో చినదొడ్డిగల్లు గ్రామానికి చెందిన వెలగా నానాజీ (40), వెలగా వెంకటరమణ (45), ఆటోలో ప్రయాణిస్తున్న మరో బాలుడు ఒ. రమేష్ (12)లకు తీవ్రగాయాలు కావడంతో స్థానిక పోలీసులు హుటాహుటిన క్షతగాత్రులను ఇక్కడి 30పడకల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితులకు ప్రధమ చికిత్సల అనంతరం తీవ్రగాయాలు కావడంతో ముగ్గురిని తదుపరి చికిత్సల నిమిత్తం విశాఖ కెజిహెచ్‌కు తరలించారు. ఈమేరకు స్థానిక ఎస్‌ఐ పి. సింహాచలం ఆర్టీసి బస్సును స్వాధీనం చేసుకుని కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన వారిలో వెలగా వెంకటరమణ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాల నుండి తెలియవచ్చింది.