విశాఖ

ప్రభుత్వానిది ప్రచార ఆర్భాటాలే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చోడవరం, డిసెంబర్ 11: ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి ప్రచార ఆర్భాటాల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాకులాడుతున్నారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ అన్నారు. సోమవారం మండలంలోని కన్నంపాలెం, రామజోగిపాలెం గ్రామాల్లో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించి చాకిపల్లిలో పల్లెనిద్ర చేసారు. ఈ సందర్భంగా ఇంటింటికీ ప్రదర్శనగా వెళ్లి వైసీపీ నవరత్నాల గూర్చి వివరించారు. అలాగే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటీ సక్రమంగా నెరవేర్చలేదన్నారు. అలాగే కేవలం ప్రజా సంక్షేమ కార్యక్రమాలను పక్కనపెట్టి ప్రచార ఆర్భాటాలకే ప్రాధాన్యతనిస్తుందన్నారు. ప్రస్తుతం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు అందరూ మద్దతునిచ్చి అండగా నిలవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు బొడ్డేడ సూర్యనారాయణ, ఏడువాక సత్యారావు, జి. ప్రసాద్, అప్పికొండ సోమేశ్వరరావు, ఓరుగంటి నెహ్రూ, పోతల అప్పారావు, బైన ఈశ్వరరావు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.