విశాఖపట్నం

పథకాలు ప్రజలకు అందాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 19: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) అమలు చేస్తున్న రుణ సదుపాయ పథకాలు ప్రజలకు చేరాలని ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి అన్నారు. యూబీఐ అధికారులతో శుక్రవారం సమావేశమైన ఆయన నూతన సంవత్సరంలో బ్యాంకు లక్ష్యాలను అధిగమించేందుకు అధికారులు శ్రద్ధ చూపాలని సూచించారు. బ్యాంకు ద్వారా చిన్న, సన్నకారు రైతులకు రుణాలు మరింత సులభంగా అందించడంతో పాటు విద్యా రుణాల విషయంలో కొత్త పథకాలు అమలు చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, వీటికి బ్యాంకు పరంగా సహకారం అందిస్తూ తోడ్పడాలని కోరారు. సమావేశంలో బ్యాంకు అధికారులు డిప్యూటీ జనరల్ మేనేజర్ కేఎస్‌ఎన్ మూర్తి, మినోచి, మేనేజర్‌లు నాగభూషణరావు, రమణమూర్తి, సుబ్బారావు పాల్గొన్నారు.