విశాఖ

చెరుకు సాగుపై రైతులు దృష్టి సారించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాకవరపాలెం, జనవరి 20: చెరుకు పంట సాగుపై రైతులు దృష్టి సారించాలని ఏటికొప్పాక షుగర్ ఫ్యాక్టరీ చైర్మన్ సాగి రామ భద్రరాజు కోరారు. శనివారం మండలంలోని బూరుగుపాలెం గ్రామంలో ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన చెరుకు కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ చెరుకు పంటను అభివృద్ధి చేసేందుకు ఈ ప్రాంతంలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించామన్నారు. చెరుకుసాగు విస్తీర్ణం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈకార్యక్రమంలో బూరుగుపాలెం సర్పంచ్ రుత్తల సత్యనారాయణ, తూటిపాల సర్పంచ్ గవిరెడ్డి ప్రసాద్, ఫ్యాక్టరీ డైరెక్టర్ బోలెం సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.