విశాఖ

ప్రభుత్వ రాయితీలను సద్వినియోగం చేసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొయ్యూరు, జనవరి 20: ప్రభుత్వం రైతాంగానికి అందించే రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని జెడ్పీటీసీ గాడి శ్రీరామ్మూర్తి అన్నారు. శనివారం మండలంలోని బాలారం గ్రామంలో 18 మంది రైతులకు టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎమ్‌వీ ఎస్‌వీ ప్రసాద్‌తో కలిసి రాయితీ ఆయిల్ ఇంజన్లు, పైపులను పంపిణీ చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ తమ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అనేక పథకాలను అమలు చేస్తుందన్నారు. వివిధ రకాల వ్యవసాయ యంత్రాలు, పరికరాలను రాయితీపై అందిస్తుందన్నారు. ప్రభుత్వం వాటర్ ఇంజన్లు, పైపులను 50శాతం రాయితీపై రైతాంగానికి పంపిణీ చేయగా, ఐ టీ సీ కంపెనీ 25శాతం వాటాను భరించి వాటిని రైతాంగానికి అందిస్తుందన్నారు. ఐటీసీ సేవలు అభినందనీయమన్నారు. ఆధునిక వ్యవసాయ పద్దతులను అలవర్చుకొని అధిక దిగుబడులను సాధించాలని వారు కోరారు. ఈకార్యక్రమంలో ఐటీసీ ప్రతినిది నాగేశ్వరరావు పలువురు రైతులు పాల్గొన్నారు.