విశాఖ

సీలేరు కాంప్లెక్స్ విద్యుత్ లైన్ క్లియర్ పనులు వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీలేరు, మే 3: రాష్ట్రంలో విద్యుత్‌కు డిమాండ్ ఉండడంతో సీలేరు కాంప్లెక్స్‌కు లైన్ క్లియర్ పనులు వాయిదా పడ్డాయని ఎపి జెన్‌కో చీఫ్ ఇంజనీర్ కేశవస్వామి తెలిపారు. మంగళవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఇప్పటికే సీలేరు కాంప్లెక్స్‌లోని డొంకరాయిలో విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. ఈనెల 1 నుంచి 15వతేదీ వరకు లోడ్ డిస్పాచ్ అధికారులు ఇటీవల ఎల్‌పి మంజూరు చేశారు. దీంతో పవర్ కెనాల్ పనులకు సిద్ధం చేశామన్నారు. ప్రస్తుతం కాంప్లెక్స్‌లోని పొల్లూరు, సీలేరు ప్రాజెక్టుల్లో విద్యుదుత్పత్తి జరుగుతోంది. అయితే విద్యుత్ కొరత నేపథ్యంలో గతంలో సీలేరు కాంప్లెక్స్ మంజూరు చేసిన ఎల్‌పిని రద్దు చేసినట్లు డిఇ కేశవస్వామి తెలిపారు. ప్రస్తుతం సీలేరు కాంప్లెక్స్‌లో 2.9 మిలియన్ యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపారు.