విశాఖపట్నం
కేంద్రం కళ్లు తెరవాలి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
విశాఖపట్నం, ఏప్రిల్ 24: రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు విషయంలో కేంద్రం వైఖరికి నిరసనగా ప్రత్యేక హోదా సాధన సమితి పిలుపు మేరకు మంగళవారం రాత్రి బ్లాక్డే పాటించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా నాలుగేళ్లపాటు తాత్సారం చేసిన కేంద్రానికి మద్దతుగా నిలిచిన టీడీపీ హఠాత్తుగా హోదా మాటమార్చడంపై అఖిలపక్షం నాయకులు మండిపడ్డారు. ప్రత్యేక హోదాకు మించి ప్యాకేజీ ఇస్తానంటే అభ్యంతరం ఏముంటుందని ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో మరోసారి ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రత్యేక హోదా పల్లవి అందుకున్నారని ఆరోపించారు. ఇది కేవలం రాజకీయ ఎత్తుగడేనని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా ప్రజల అభిమతాన్ని చాటేందుకే అన్ని రాజకీయ పక్షాల ఆధ్వర్యంలో బ్లాక్డే పాటించామన్నారు. కార్యక్రమంలో వైసీపీ నాయకుడు తైనాల విజయ్కుమార్, సీపీఎం కార్యదర్శి నర్శింగరావు, సీపీఐ, లోక్సత్తా నాయకులు పాల్గొన్నారు.