విశాఖ

రూ. 20 లక్షల విలువైన గంజాయి స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సీపట్నం, మే 10: విశాఖ ఏజెన్సీ నుండి మైదాన ప్రాంతానికి అక్రమంగా తరలిస్తున్న సుమారు 20 లక్షల రూపాయల విలువచేసే 625 కిలోల గంజాయిని స్థానిక రూరల్ పోలీసులు పట్టుకున్నారు. గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. రూరల్ ఎస్సై విజయ్‌కుమార్ అందించిన వివరాలిలా ఉన్నాయి. మంగళవారం ఉదయం గబ్బాడ శివార్లలోని వంతెన సమీపంలో వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా చింతపల్లి వైపు నుండి నర్సీపట్నం వస్తున్న టాటా వ్యాన్ ఆపి తనిఖీ చేయగా గంజాయి మూటలు ఉన్నట్లు గుర్తించారు. వ్యాన్‌లో ప్రయాణిస్తున్న ఎ.అన్నవరం గ్రామానికి చెందిన గోడి రవికుమార్(40), కడారి కృష్ణ(35), లంబసింగికి చెందిన బోనంగి బోడకొండపడాల్‌లను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశామన్నారు. నిందితుల నుండి 24 వేల రూపాయల నగదు, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని టాటా వ్యాన్, మోటార్ బైక్‌ను సీజ్ చేశామన్నారు. నర్సీపట్నం ఎఎస్పీ ఐశ్వర్య రస్తోగికి ఆదేశాల మేరకు దాడులు నిర్వహించామన్నా రు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ అన్నారు. ఈదాడుల్లో ఎస్సై విజయ్‌కుమార్,సిబ్బంది పాల్గొన్నారు.