విశాఖ

బాధ్యతల నుంచి రిలీవైన పీవో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాడేరు, జూన్ 23: విజయవాడ ఎన్.టి.ఆర్.వైద్య ట్రస్ట్ ముఖ్య కార్యదర్శిగా బదిలీ జరిగిన పాడేరు ఐ.టి.డి.ఎ. ప్రాజెక్టు అధికారి పి.రవిసుభాష్ తన బాధ్యతల నుంచి శుక్రవారం మధ్యాహ్నాం రిలీవయ్యారు. పాడేరు సబ్ కలెక్టర్ డి.కె.బాలాజికి ఐ.టి.డి.ఎ. ప్రాజెక్టు అధికారిగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో రవిసుభాష్ సబ్ కలెక్టర్‌కు బాధ్యతలను అప్పగించారు. దీంతో ఐ.టి.డి.ఎ.కు పూర్తి స్థాయి ప్రాజెక్టు అధికారిని ప్రభుత్వం నియమించే వరకు సబ్ కలెక్టర్ బాలాజి ప్రాజెక్టు అధికారి బాధ్యతలను కూడా అదనంగా నిర్వహించనున్నారు. బదిలీపై వెళుతున్న రవిసుభాష్‌కు ఐ.టి.డి.ఎ. అధికారులు, ఉద్యోగులు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో ఐ.టి.డి.ఎ. సహాయ ప్రాజెక్టు అధికారులు ప్రభాకర్, కుమార్, పరిపాలన అధికారి వేగి అప్పారావు, మేనేజర్ సునీల్, గిరిజన సంక్షేమ శాఖ పాడేరు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్, కాఫీ ప్రాజెక్టు అసిస్టెంట్ డైరెక్టర్ రాధాక్రిష్ణ, ఉపాధి హామీ పథకం ఎ.పి.డి. లచ్చన్న, వెలుగు ఎ.పి.డి. నాగేశ్వరరావు, పలువురు అధికారులు పాల్గొన్నారు.