విశాఖపట్నం
ఏయూ అకడమిక్ డీన్గా ఎంవీఆర్ రాజు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 21 July 2018
విశాఖపట్నం, జూలై 20: ఆంధ్ర విశ్వవిద్యాలయం అకడమిక్ డీన్గా సైకాలజీ విభాగం ప్రొఫెసర్ ఎంవీఆర్ రాజు నియమితులయ్యారు. ఈ మేరకు ఏయూ వైస్ఛాన్స్లర్ ప్రొఫెసర్ జీ నాగేశ్వర రావు తన కార్యాలయంలో డీన్ నియామకానికి సంబంధించి ఉత్తర్వులు శుక్రవారం అందజేశారు. అకడమిక్ డీన్గా బాధ్యతలు చేపట్టిన రాజును వర్శిటీ అధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు అభినందించారు.
కనకమహాలక్ష్మికి క్షీరాభిషేకం
విశాఖపట్నం (కల్చరల్), జూలై 20: ఉత్తరాంధ్ర ప్రజానీకం ఆరాధ్యదైవం శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారికి క్షీరాభిషేకం ఘనంగా నిర్వహించారు. ప్రతి శుక్రవారం ఉదయం జరిగే ఈ కార్యక్రమంలో 26 మంది ఉభయ దాతలు పాల్గొంటారు. ఈ పూజ చేయాలనుకున్న భక్తులు రూ.200 చెల్లించి పూజలో పాల్గొనవచ్చన్నారు.