విశాఖపట్నం

చందనం అరగదీత ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింహాచలం, మే 13: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామివారి దేవాలయంలో రెండో విడత చందనం అరగదీత ప్రక్రియ శుక్రవారం సంప్రదాయ బద్ధంగా ప్రారంభించారు. వైశాఖ పౌర్ణమి సందర్భంగా స్వామివారికి గంథం సమర్పణ చేయనున్న నేపథ్యంలో ఉద్యోగులు గంధం అరగదీస్తున్నారు. 125 కిలోల గంధం అవసరంకాగా తొలిరోజు 38 కిలోల అరగదీశారు. వైదికులు గంధాన్ని తూకం వేసి తీసుకుని భాండాగారంలో భద్రపరిచారు.
నిత్యాన్నప్రసాదానికి రూ.లక్ష విరాళం
నగరానికి చెందిన కె.అప్పారావు అనే భక్తుడు సింహాద్రినాధ నిత్యాన్న ప్రసాద పథకానికి రూ.లక్ష విరాళంగా సమర్పించారు. శుక్రవారం విరాళం అందజేశారని దేవస్థానం అధికారులు తెలిపారు. కాగా, విశాఖ రేంజ్ కొత్త డిఐజీగా బాధ్యతలు చేపట్టిన శ్రీకాంత్, సీనియర్ సినీ నటి మంజుభార్గవి సింహాచలేశుని తర్మనం చేసుకున్నారు.