విశాఖపట్నం

వుడా ప్రాజెక్ట్‌లను సందర్శించనున్న ముంబై విద్యార్థులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 16: విశాఖలో వుడా చేపట్టిన వివిధ ప్రాజెక్ట్‌లను సందర్శించేందుకు ముంబైకి చెందిన స్కూల్ ఆఫ్ ఎన్విరాన్‌మెంట్ అండ్ ఆర్కిటెక్ట్ విద్యార్థులు గురువారం నగరానికి చేరుకున్నారు. వారు వుడా వీసీ బసంత్ కుమార్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బంత్ కుమార్ విద్యార్థులతో మాట్లాడి, వుడా పరిధిలోని ప్రాజెక్ట్‌లను ఆరు రోజులపాటు చూసేందుకు అనమతి ఇస్తున్నట్టు చెప్పారు. వారు చేసిన అధ్యయన నివేదికను వుడాకు అందచేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వుడా చేపడుతున్న ప్రాజెక్ట్‌ల గురించి వుడా ప్లానింగ్ అధికారి సుశీల పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.