విశాఖపట్నం

సబ్‌మెరైన్ శిక్షణ పూర్తి చేసుకున్న సెయిలర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 21: తూర్పు నౌకాదళ ప్రధాన కార్యాలయంలో ఉన్న సబ్‌మెరైన్ స్కూల్‌లో 93వ సింధుఘోష్ బేసిక్ సబ్‌మెరైన్ కోర్స్, 11వ శిశుమార్ బేసిక్ సబ్‌మెరైన్ కోర్సును 15 మంది అధికారులు, 65 మంది సెయిలర్లు పూర్తి చేసుకున్నారు. వీరంతా 24 వారాలపాటు కఠోరమైన శిక్షణ పొందారు. వీరి పాస్-అవుట్ కార్యక్రమం ఐఎన్‌ఎస్ శాతవాహనలోని సబ్‌మెరైన్ స్కూల్‌లో ఘనంగా జరిగింది. సదరన్ నేవల్ కమాండ్ చీఫ్ స్ట్ఫా ఆఫీసర్ రియర్ అడ్మిరల్ కృష్ణస్వామినాథన్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శిక్షణలో ప్రతిభ కనబరిచిన వారికి స్వామినాథన్ బహుమతులను అందచేశారు. ఇక్కడ శిక్షణ పూర్తి చేసుకున్న వీరంతా ముంబై, విశాఖలో ఉన్న సబ్‌మెరైన్‌లలో తదుపరి శిక్షణ నిమిత్తం వెళ్లారు.