విశాఖపట్నం

మూడువేల కిలో మీటర్లు దాటిన జగన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోటవురట్ల, సెప్టెంబర్ 24: ప్రజా సంకల్ప యాత్ర మూడువేల కిలో మీటర్లు దాటిన సందర్భంగా సోమవారం మండలానికి చెందిన పలువురు నేతలు జగన్‌ను కలిసి శుభాకాంక్షలు తెలియజేసారు. కోటవురట్ల మండలం తంగేడు రాజుల కుటుంబానికి చెందిన వైసీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి దత్తుడు సీతబాబు, పార్టీ యువజన నాయకుడు నారాయణమూర్తి రాజు, విజయనగరం జిల్లా దేశ పాత్రునిపాలెం వద్ద జగన్‌ను కలిసి మూడువేల కిలో మీటర్లు మైలు రాయి దాటిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసారు. అలాగే ఫైలాన్ ఆవిష్కరణ కార్యక్రమంలో వీరు పాల్గొన్నారు. పాయకరావుపేట అసెంబ్లీ టిక్కెట్‌ను గొల్లబాబూరావుకే ఇవ్వాలని ఈసందర్భంగా జగన్‌కు విజ్ఞప్తి చేసినట్లు దత్తుడు సీతబాబు తెలిపారు.
ఉత్సాహ భరితంగా కొనసాగుతున్న సీ ఎం కప్ పోటీలు
కోటవురట్ల, సెప్టెంబర్ 24: స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో సీ ఎం కప్ క్రీడా పోటీలు ఉత్సాహభరితంగా సాగుతున్నాయి. ఈనెల 22న ప్రారంభమైన ఈపోటీలు 25 వరకు కొనసాగుతాయని ఫిజికల్ డైరెక్టర్ మునగాడ దాస్ తెలిపారు. బాలురకు కబాడీ, ఖోఖో, రన్నింగ్, షార్ట్‌పుట్, జావెలింగ్‌త్రో, మహిళలకు రింగ్ టెన్నిస్, త్రోబాల్, బ్యాట్మింటన్ తదితర పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. సోమవారం జరిగిన పోటీలకు సంబంధించి ఖోఖోలో జల్లూరు హైస్కూల్ జట్టు ప్రథమ స్థానం, కొడవటిపూడి ఎంపీయుపీ స్కూల్ ద్వితీయ స్థానం దక్కించుకున్నట్లు తెలిపారు. కబాడీలో కోటవురట్ల జట్టుకు మొదటి స్థానం , ద్వితీయ స్థానం పాములవాకకు దక్కిందన్నారు. వంద మీటర్ల రన్నింగ్ పోటీల్లో ప్రథమ, ద్వితీయ స్థానాలు కొడవటిపూడి ఎంపీయుపీ స్కూల్, మూడవ స్థానం కోటవురట్లకు దక్కిందన్నారు. ఈకార్యక్రమంలో ఉపాధ్యాయులు సంగీతరాజు, డేవిడ్ తదితరులు పాల్గొన్నారు.