విశాఖ

వచ్చే సీజన్‌లోనైనా తుమ్మపాలలో క్రషింగ్ జరపాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనకాఫల్లి, మే 17: వచ్చే సీజన్‌లోనైనా తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ క్రషింగ్ జరిపేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆమ్‌ఆద్మీ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో కార్యాలయ ప్రతినిధి ఎస్. సత్యనారాయణను కలిసి మంగళవారం వారు వినతిపత్రం అందజేశారు. ఆమ్‌ఆద్మీ పార్టీ అనకాపల్లి పట్టణ నాయకులు కొణతాల హరినాథ్‌బాబు నేతృత్వంలో 20నెలల కార్మికుల జీతం బకాయిలు చెల్లించాలని, చెరకు రైతుల బకాయిలు చెల్లించాలని, వచ్చే సీజన్‌లో క్రషింగ్‌ను పునఃప్రారంభించేందుకు ఇప్పటి నుండే పాలకులు చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మావూరి రవికుమార్, వికలాంగుల సంఘ ప్రతినిధి బుగిడి నూక అప్పారావు, వేచలపు రామునాయుడు, రెడ్డి కిత్తమనాయుడు పాల్గొన్నారు.