క్రైమ్/లీగల్

మృతదేహం తరలిస్తున్న అంబులెన్స్‌కు ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంచంగిపుట్టు, నవంబర్ 3: మృతదేహాన్ని తరలిస్తున్న అంబులెన్స్ ప్రమాదానికి గురికావడంతో ఆరుగురు గిరిజనులు గాయాలకు గురయ్యారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో వీరికి ప్రధమ చికిత్స అనంతరం పాడేరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇందుకు సంబంధించిన వివరాల ప్రకారం ఆటో ప్రమాదంలో శుక్రవారం మృతి చెందిన కిల్ల సోమరి అనే మహిళ మృతదేహానికి శుక్రవారం స్థానిక ఏరియా ఆసుపత్రిలో శవ పంచనామా నిర్వహించి మృతురాలి స్వగ్రామమైన బాబుసాల పంచాయతీ గేదెలపుట్టు గ్రామానికి అంబులెన్స్‌లో తరలించారు. అయితే అంబులెన్స్ డ్రైవర్ గేదెలపుట్టు గ్రామ సమీపాన వాహనాన్ని రోడ్డు పక్కన నిలుపుదల చేసి కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లగా ఇంతలో ఒక యువకుడు వాహనాన్ని స్టార్ట్ చేయడంతో ఒక్కసారిగా ముందుకు కదిలి గోతిలోకి జారుకుంది. ఈ ప్రమాదంలో మృతదేహాంతో పాటు అంబులెన్స్‌లో ఉన్న కె.సోర్రుపడాల్, సోమన్న, హరిబాబు తలకు బలమైన గాయాలు కావడంతో వీరిని హుటాహుటిన ముంచంగిపుట్టు ఆసుపత్రికి తరలించి ప్రధమ చికిత్స అనంతరం పాడేరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. అంబులెన్స్‌లో ఉన్న మరో ముగ్గురికి స్వల్పగాయాలయ్యాయి. ఈ సంఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.