విశాఖపట్నం

స్నాతకోత్సవ ముఖ్యఅతిధిగా రామ్ గోపాలరావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 15: ఆంధ్ర విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి రంగం సిద్ధమైంది. ఈ నెల 19న జరిగే స్నాతకోత్సవానికి ఢిల్లీ ఐఐటీ సంచాలకులు ఆచార్య వీ రామ్ గోపాలరావు హాజరుకానున్నారు. స్నాతకోత్సవానికి ఐఐటీ సంచాలకులు రామ్ గోపాలరావును ఆహ్వానించాలని శనివారం జరిగిన పాలకమండలి సమావేశంలో నిర్ణయించినట్టు వైస్‌ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ జీ నాగేశ్వర రావు తెలిపారు. స్నాతకోత్సవానికి ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ హాజరుకానున్నట్టు వెల్లడించారు. స్నాతకోత్సవం సందర్భంగా ఆరుగురికి ఎంఫిల్ పట్టాలు, 546 మందికి పీహెచ్‌డీలు, 573 మందికి అ ప్రైజులు, మెడల్స్ అందజేస్తామన్నారు. 19వ తేదీ ఉదయం 11 గంటలకు స్నాతకోత్సవం జరుగుతుందన్నారు. అలాగే వర్శిటీలో పనిచేస్తున్న కన్సాలిడేటెడ్ ఎంప్లారుూస్‌కు సంబంధించి గతంలో నియమించిన కమిటీ నివేదిక కోరనున్నామన్నారు. వీరిని 28 రోజుల విధానంలోకి మార్చేందుకు గల అవకాశాలపై నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంటామన్నారు. వర్శిటీలో మినిమమ్ టైం స్కేల్ (ఎంటీఎస్) విధానంలో పనిచేస్తున్న వారిని వర్శిటీ ఉద్యోగులుగా రెగ్యులరైజ్ చేసేందుకు ప్రభుత్వ అనుమతిని కోరుతూ లేఖ రాశామన్నారు. వర్శిటీ ఆధ్వర్యంలోని కళాశాలలకు పూర్తి స్థాయిలో ప్లేస్‌మెంట్ అధికారులను నియమిస్తామని, ఇంజనీరింగ్, మహిళా ఇంజనీరింగ్ కళాశాలలు, ఏయూ న్యాయ, ఆర్ట్ అండ్ కామర్స్ కశాళాల, సైన్స్, ఫార్మశీ కళాశాలకు ముగ్గురు ప్లేస్‌మెంట్ అధికారులను కన్సాలిడేటెడ్ పేమెంట్ విధానంలో నియమించాలని నిర్ణయించామన్నారు. అలాగే ప్లేస్‌మెంట్ కార్యాలయ నిర్వహణకు వౌలిక వసతుల కల్పన, నిర్వహణ ఖర్చుల కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని పాలకమండలి నిర్ణయించిందన్నారు. సమావేశంలో రెక్టార్ ప్రొఫెసర్ ఎం ప్రసాదరావు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె నిరంజన్, సభ్యులు ప్రొఫెసర్లు రామ్మోహనరావు, శశిభూషణ రావు, ఎన్ బాబయ్య, సురేష్ చిట్టినేని, డాక్టర్ ఎస్ విజయరవీంద్ర, డాక్టర్ పీ సోమనాధరావు తదితరులు పాల్గొన్నారు.

విద్యకు లేని నిధులు విగ్రహాలకు ఎక్కడివి
* కేంద్ర ప్రభుత్వ తీరుపై ఎస్‌ఎఫ్‌ఐ ధ్వజం *జాతీయ సంయుక్త కార్యదర్శి నితీష్ నారాయణ్

విశాఖపట్నం, డిసెంబర్ 15: యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించే విద్యకు దక్కని నిధులు దేశంలో విగ్రహాలకు ఖర్చవుతున్నాయని భారత విద్యార్థి సమాఖ్య (ఎస్‌ఎఫ్‌ఐ) జాతీయ సంయుక్త కార్యదర్శి నితీష్ నారాయణ్ విమర్శించారు. ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఏయూ అంబేద్కర్ ఆసెంబ్లీ హాల్‌లో రెండు రోజుల పాటు జరగనున్న సదస్సు శనివారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా తొలి రోజు కార్యక్రమంలో 3విద్యా రంగంలో మార్పులు-సవాళ్లు2 అంశంపై జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సర్ధార్ పటేల్, ఛత్రపతి శివాజీ విగ్రహాలకు వేల కోట్లు ఖర్చు పెట్టిన నరేంద్ర మోదీ ప్రభుత్వం విద్యకు మాత్రం అరకొర నిధులు విదుల్చుతోందని మండిపడ్డారు. ప్రధాని మోదీ ఆర్భాటపు ఖర్చులు రూ.3000 కోట్లు వెచ్చిస్తే ప్రస్తుతం అరకొర సదుపాయాలతో నడుస్తున్న ఐఐఎం, ఐఐటీ, కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో వసతులు కల్పించవచ్చన్నారు. అయితే భిన్న జాతులు, మతాలకు నిలయమైన భారతదేశంలో కల్లోలం సృష్టించేందుకు బీజేపీ, అనుబంధ విభాగాలు యత్నిస్తున్నాయని ఆరోపించారు. చరిత్రలో ఎక్కడ భారతదేశం హిందువుల రాజ్యంగా చెప్పలేదన్నారు. అయితే పాలకులు మాత్రం హిందూరాజ్యం అంటూ ముస్లింలు, మైనార్టీలు, దళితులను అణచివేసే కుట్రలు పన్నుతోందన్నారు. అల్పసంఖ్యాక వర్గాలు బీజేపీ తీరుతో అభద్రత భావానికి గురికావాల్సి వస్తోందని, దీన్ని యువత ముక్తకంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు. గోరఖ్‌పూర్ ఆసుపత్రిలో ఆక్సిజన్ అందుబాటులో లేక 73 మంది చిన్నారులు మరణించారని, వీరి తల్లిదండ్రుల ఆవేదన ఏ ప్రభుత్వాలు తీర్చగలవన్నారు. విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాన్ని నిలదీసి పోరాడేందుకు ఎస్‌ఎఫ్‌ఐ సిద్ధంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నగర అధ్యక్ష, కార్యదర్శులు ఎల్‌జే నాయుడు, అప్పలరాజు, ఎయూ విభాగం అధ్యక్ష, కార్యదర్శులు గౌతమ్, ఎల్ చిన్నారి తదితరులు పాల్గొన్నారు.
అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి

విశాఖపట్నం, డిసెంబర్ 15: అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా శనివారం ఏపీఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో సంస్థ అధికారులు సిబ్బంది ఘనంగా నివాళులర్పించారు. సంస్థ కార్పొరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో పొట్టి శ్రీరాములు చిత్రపటానికి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ హెచ్‌వై దొర పూలమాల వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా సిఎండి మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం 1952 సంవత్సరంలో 58 రోజులపాటు నిరాహరదీక్ష చేసి, తన ఆశయ సాధనలో ప్రాణాలర్పించిన అమరజీవి అన్నారు. ఆయన ఆత్మార్పణ ఫలితంగా కర్నూలు రాజధానిగా 1953న నవంబర్ ఒకటవ తేదీన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందన్నారు. పొట్టి శ్రీరాములు అణగారిన వర్గాల అభివృద్ధికి, తన జీవిత్న్ని దారపోసిన మహోన్నత వ్యక్తిగా స్వాతంత్ర సమరయోధునిగా గొప్ప సంఘ సంస్కర్తగా ఆయన నిర్వర్తించిన పాత్రను కొనియాడారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు బొడ్డు శేషుకుమార్, టీవీఎస్ చంద్రశేఖర్, సీజీఎంలు కెఎస్‌ఎన్ మూర్తి, పీ.నాగేశ్వరరావు, ఓ.సింహాద్రి, పీవీవీ సత్యనారాయణ, వైయస్‌ఎన్ ప్రసాద్, కార్పోరేట్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
విద్యుత్‌శాఖకు వాయుగండాలు2...
* ఈపీడీసీఎల్‌కు తుపాన్ల భయం...* నాడు హుదూద్, మొన్న తిత్లీ, నేడు పెథాయ్
* వరుస సంఘటనలతో ఆర్ధిక నష్టాలు * ప్రతి జిల్లాలో అప్రమత్తం

విశాఖపట్నం, డిసెంబర్ 15: విద్యుత్‌శాఖకు వాయుగండాలు, తుపాన్ల భయం పట్టుకుంది. ఏ క్షణంలో ఎటువంటి తుపాన్లు ముంచుకొస్తాయోనన్న గుబులుతోనే వణికిపోతోంది. వరుస తుపాన్లతో నిత్యం సంస్థకు ఆర్ధికపరమైన నష్టాలు తప్పడంలేదు. ఇవి కూడా తట్టుకోలేనంతగా ఉంటున్నాయి. హుదూద్, తిత్లీ వంటి భయంకరమైన తుపాన్ల నుంచి ఇంకా కోలోలేకపోతున్న విద్యుత్‌శాఖకు ఇపుడు పెథాయ్ తుపాను భయం పట్టుకుంది. ఈ నెల 17వ తేదీన విశాఖలో తీరం దాటే పెథాయ్ తుపానుతో మళ్ళీ ఏ విధంగా నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుందోనన్న గుబులుతో సంస్థ ఉంది. ఒకవైపు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నా భారీ నష్టాలపైనే ఆందోళన చెందుతోంది. గత రెండు రోజులుగా ముందస్తు ఏర్పాట్లు తీసుకుంటూనే ఉంది. విద్యుత్ సబ్‌స్టేషన్లు భారీ టవర్లు, విద్యుత్ లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు వద్ద పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. భారీగా వీస్తోన్న ఈదురుగాలుల నుంచి విద్యుత్ వ్యవస్థను పరిరక్షించుకునేందుకు వీలుగా జనరల్ మేనేజర్లు, డిజిఎంల పర్యవేక్షణలో ఎప్పటికపుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు. ఒకవైపు విద్యుత్ సరఫరాకు ఇబ్బందులు లేకుండా చేస్తూనే మరోపక్క ఈదురుగాలులతో విద్యుత్ వ్యవస్థ చిన్నాభిన్నం కాకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (ఏపీఈపీడీసీఎల్) పరిధిలోకి వచ్చే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు,పశ్చిమగోదావరి జిల్లాలకు సంబంధించి ముఖ్యమైన పట్టణ ప్రాంతాలు, కొండ ప్రాంతాల్లో విద్యుత్ వ్యవస్థ దెబ్బతినే పరిస్థితులను ఎప్పటికపుడు సమీక్షించి తక్షణ చర్యలు చేపట్టేందుకు వీలుగా క్షేత్రస్థాయి నుంచి అధికారుల వరకు అప్రమత్తమయ్యారు. ఎస్‌ఇలు, డిఇఇలు, ఏడీఇ, ఏఇలతోపాటు లైన్‌మెన్లు ఇతర సిబ్బంది విద్యుత్ లైన్లు, సబ్‌స్టేషన్లు, ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద పటిష్ట భద్రతాపరమైన చర్యలు చేపడుతున్నారు. ఆది,సోమవారాల్లో పెథాయ్ తుపాను మరింత ఉధృతం కానున్నందున దీనికి తగినట్టుగా యాజమాన్యం ప్రత్యేక యంత్రాంగాన్ని సిద్ధం చేస్తోంది.
పెరుగుతున్న తుపాన్ల నష్టం...
వరుస తుపాన్లతో ఈపీడీసీఎల్ తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. 2014 అక్టోబర్ 12వ తేదీన విశాఖలో సంభవించిన హుదూద్ తుపానుతో ఏపీఈపీడీసీఎల్‌కు రూ.1200 కోట్లకు పైగానే ఆర్ధిక నష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ నష్టాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పటికీ ఎటువంటి ఆర్ధిక సహాయం అందనేలేదు. దీని నుంచి తేరుకోకముందే ఇటీవల శ్రీకాకుళం జిల్లాను తిత్లీ తుపాను తుడిచిపెట్టుకుపోయింది. దీనివల్ల ఈపీడీసీఎల్ రూ.500 కోట్ల మేర నష్టాన్ని చవి చూడాల్సి వచ్చింది. ఈ విధంగా గడచిన నాలుగేళ్ళ కాలంలో రెండు తుపాన్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. వీటి వలన దాదాపు రెండు వేల కోట్ల మేర విద్యుత్‌పరంగా ఆస్తుల నష్టం ఏర్పడింది. ఈ రెండింటి నుంచి ఎదురైన నష్టాల నుంచి ఏమాత్రం బయటపడలేకపోతున్న సంస్థ యాజమాన్యానికి 3గోరుచుట్టుపై రోకటి పోటు2 మాదిరి పెథాయ్ తుపాను భయం పట్టుకుంది. విశాఖ నగరంలో శనివారం మధ్యాహ్నం భారీగా ఈదురుగాలులు వీస్తున్న పరిస్థితులు విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగిస్తుండగా బలహీనంగా ఉండే విద్యుత్ లైన్ల మార్గంలోను, జిల్లాలో పలుచోట్ల సబ్‌స్టేషన్ల వద్ద సాంకేతికపరమైన సమస్యలు తలెత్తున్నట్టు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. కాగా తుపాన్ల కారణంగా విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో విద్యుత్ పరంగా తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్న ఈపీడీసీఎల్‌కు ఇపుడు విశాఖ జిల్లాలోను, పొరుగు జిల్లాలకు నష్టాలు తప్పేటట్టు లేదని ఈ వర్గాలు అంటున్నాయి.