విశాఖపట్నం

ఆగిన ఆర్టీసీ...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 17: ఆర్టీసీ ఆగింది. ఒకటీ, రెండూ కాదు...ఏకంగా 500కు మించి ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఇవేమీ రోడ్డెక్కనేలేదు. ఉన్న వాటిల్లో 60నుంచి 70శాతం మేర బస్సులు కదలనేలేదు. పెథాయ్ తుపాను హెచ్చరికలతో బుధవారం రాత్రి నుంచి కురుస్తోన్న భారీ వర్షాలు, ఈదురుగాలులు కారణంగా జనం సైతం రోడ్డెక్కలేదు. ముందస్తు జాగ్రత్తల కారణంగా తుపాను వలన ఎదురయ్యే నష్టాలను లేకుండా చేసుకోగలిగామని ఆర్టీసీ అదికారులు చెబుతున్నారు. లక్షల లీటర్ల డీజిల్‌ను రెండు రోజుల ముందుగానే సమకూర్చుకోగా, ప్రతి డిపో నుంచి బయలుదేరి వెళ్ళే బస్సులకు సంబంధించి అధికారులు ముందుగానే నిర్ణయం తీసుకున్నారు.
* నిలిచిన 500 బస్సులు...
ఆర్టీసీ విశాఖ రీజియన్ పరిధిలో దాదాపు 800 బస్సులు నడుస్తుంగా ఇందులో తెలుగు-వెలుగు, సిటీ సర్వీసులు, ఎక్స్‌ప్రెస్‌లు, సూపర్‌డీలక్స్‌లు, మెట్రోలున్నాయి. అయితే విశాఖ నుంచి సికింద్రాబాద్, విజయవాడ, గుంటూరు, తిరుమతి, భీమవరం, ఒంగోలు, నెల్లూరు, శ్రీకాళహస్తి, కాకినాడ, అమలాపురం, రాజమండ్రి తదితర ప్రాంతాలకు వెళ్ళే బస్సులను అన్నింటినీ ముందుగానే నిలిపివేశారు. సోమవారం ఉదయం నుంచి ఇవి నిలిచిపోయాయి. అలాగే సిటీ బస్సుల్లో కొన్ని రూట్లకు సంబందించి నిలిపివేయగా, మరికొన్ని రూట్లలో కొన్నింటినే నిర్వహించారు. కొన్నింటినీ ఉదయం నిలిపివేయగా, మరికొన్నింటినీ మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు రద్దు చేయాల్సి వచ్చింది. విశాఖ ఏజెన్సీ చింతపల్లి, పాడేరు, అరకు, అనంతగిరి, ఎస్.కోట, నర్సీపట్నం, భద్రాచలం, సీలేరు తదితర ప్రాంతాలకు వెళ్ళే వాటిలో కొన్ని నిలిచిపోతాయి. ఈ విధంగా నిలిచిపోయిన బస్సుల వలన ఆర్టీసీ విశాఖ రీజియన్‌కు 30నుంచి 40 లక్షల మేర ఆదాయాన్ని కోల్పోవల్సి వచ్చింది. వాతావరణం పరిస్థితులనుబట్టి మంగళవారం ఉదయం నుంచి దూర ప్రాంతాలకు వెళ్ళే బస్సుల నిర్వహణపై నిర్ణయాన్ని తీసుకుంటామని డిప్యూటీ చీఫ్ మెకానికల్ ఇంజనీర్ బి.అప్పలనాయుడు సోమవారం రాత్రి 3ఆంధ్రభూమి2కి తెలిపారు. తుపాను ప్రభావిత ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులను నిర్వహించకూడదంటూ ఆర్టీసీ ఎండీ చేసిన ఆదేశాలతో ఇక్కడి రీజనల్ మేనేజర్ సుదేశ్‌కుమార్ ముందస్తు చర్యలు తీసుకున్నారు.
* రోడ్డెక్కని జనం...
పెథాయ్ తుపానుకు సంబంధించి జిల్లా యంత్రాంగం ముందస్తు హెచ్చరికలు చేయడంతో జనం ఇళ్ళకే పరిమితమయ్యారు. తప్పనిసరి పరిస్థితుల్లో విధులకు హాజరుకావాల్సిన ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు తప్పితే ఏ ఒక్కరూ సోమవారం ఉదయం నుంచి ఇళ్ళ నుండి బయటకు రాలేదు. పాఠశాలలు, కాలేజీలకు సోమవారం సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు ఇళ్ళకే పరిమితమయ్యారు.