విశాఖపట్నం

విద్యుత్ వ్యవస్థ అస్తవ్యస్తం...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 17: పెథాయ్ తుపానుతో విద్యుత్ వ్యవస్థ అస్తవ్యస్తమైంది. బలమైన ఈదురుగాలులు, భారీ వర్షంతో అనేకచోట్ల స్తంభాలు నేలకూలాయి. లైన్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. జిల్లా పరిధిలో ఎస్.రాయవరం, నక్కపల్లి, రాంబిల్లి, అచ్యుతాపురం, కోరుప్రోలు, పాయకరావుపేట తదితర ప్రాంతాల్లో స్తంభాలపై చెట్ల కొమ్మలు విరిగాపడటంతో సరఫరా నిలిచిపోయింది. మరికొన్నిచోట్ల సబ్‌స్టేషన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతినడం, సాంకేతికపరమైన సమస్యలు తలెత్తతున్నాయి. మధ్యాహ్నం నుంచి రాత్రి ఏడు గంటల వరకు నగరంలోను, శివారుప్రాంతాల్లో ఏకదాటిగా కురిసిన భారీ వర్షం, బలమైన ఈదురుగాలులు కారణంగా విద్యుత్ సరఫరా అనేకసార్లు నిలిచిపోయింది. ముందుస్తు చర్యల్లో భాగంగా అధికారులు అప్రమత్తం కావడంతో భారీ నష్టాల నుంచి బయటపడగలిగారు. ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (ఈపీడీసీఎల్) సిఎండి హెచ్‌వై దొర ఆదేశాలపై ఆపరేషన్ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ (ఎస్‌ఇ) బి.సూర్యప్రకాష్ పలు మండల కేంద్రాల్లో విస్తృతంగా పర్యటించి సత్వర చర్యలు చేపడుతున్నారు. క్షేత్రస్థాయి నుంచి సిబ్బంది, ఉద్యోగులను అప్రమత్తం చేయడంతో సబ్‌స్టేషన్ల వారీగా సాంకేతికపరమైన సమస్యలను ఎప్పటికపుడు పరిష్కరిస్తున్నారు. తుపాను ప్రభావతి ప్రాంతాలు పాయకరావుపేట, కోరుప్రోలు, ఎస్.రాయవరం, నక్కపల్లి, రాంబిల్లి, అచ్యుతాపురం తదితర ప్రాంతాల పరిస్థితుల ఆయన ఎప్పటికపుడు సమీక్షిస్తున్నారు. దాదాపు వెయ్యి మంది సిబ్బందిని అందుబాటులోకి ఉంచడంతో పునరుద్ధరణ పనులు చురుగ్గా సాగుతున్నాయని సోమవారం రాత్రి 3ఆంధ్రభూమి2కి తెలియజేశారు. అలాగే అనకాపల్లి, యలమంచిలి మండలాల పరిధిలో ఎప్పటికపుడు విద్యుత్ పరిస్థితులను సమీక్షిస్తుండగా పట్టణ ప్రాంతాల్లో ప్రతి ఒక్క జోన్‌లో డిఇఇలు, ఏడీఇలు, అసిస్టెంట్ల ఇంజనీర్ల పర్యవేక్షణలో విద్యుత్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నారన్నారు. ఎటువంటి గంటల వ్యవదిలోనే విద్యుత్‌ను మెరుగుపర్చేందుకు వీలుగా యంత్రాంగాన్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు.

వెలవెలబోయిన సింహాచల క్షేత్రం
సింహాచలం, డిసెంబర్ 17: పెథాయ్ తుఫాన్ ప్రభావంతో ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింహాచలం భక్తుల తాకిడి లేక వెలవెలబోయింది. ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న జల్లులు సాయంత్రానికి పెరిగాయి. ఈదురుగాలులు వీస్తుండడంతో సింహగిరి పైన పందిళ్ల పరిస్థితి అధికారులను ఆందోళనకి గురిస్తోంది. సరుగుడు కర్రలు,వెదురు చాపలతో ఏర్పాటు చేసిన పందిళ్లు గాలులకు ఊగుతున్నాయి. సింహగిరికి వాహనాలు కూడా అడపదడపా మాత్రమే వచ్చాయి. భక్తులు తాకిడి అనూహ్యంగా తగ్గిపోవడంతో చాలా మంది వ్యాపారులు దుకాణాలను తెరవలేదు. రోజూ పెద్ద మొత్తంలో సింహగిరికి నడిచే స్థానిక ప్రయివేటు వాహనాలు కూడా నిలిచిపోయాయి. చిల్లర వ్యాపారులకు కనీస వ్యాపారం జరగలేదు. దీంతో వ్యాపారులంతా మధ్యాహ్నం నుండి ఇళ్లకే పరిమితమయ్యారు. పాఠశాలలకు సెలవుప్రకటించడంతో రహదారుల్లో వాహనాల రద్దీ గణనీయంగా తగ్గింది. పలుమార్లు విద్యుత్‌కి అంతరాయం ఏర్పడింది.
ఆనందపురంలో 60.4మిల్లీ లీటర్ల వర్షపాతం నమోదు
ఆనందపురం, డిసెంబర్ 17: మంగళవారం కురిసిన వర్షానికి ఆనందపురం మండలంలో 60.4మిల్లీ లీటర్ల వర్షపాతం నమోదైనట్లు మండల వ్యవసాయాధికారిణి శివకోమలి తెలిపారు. ఆమె మంగళవారం తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. వరిపొలాలను సందర్శించిన ఆమె వరికుప్పలపై టార్మాన్లు కప్పుకోవాలని రైతులకు సూచించారు. అలాగే కోత పూర్తయి తడిచిపోయిన పనలను వర్షాలు తగ్గన అనంతరం రెండు శాతం ఉప్పుద్రావణాన్ని పిచికారి చేయడం ద్వారా మొలకెత్తకుండా నివారించుకోవచ్చన్నారు. ఇంకా వర్షాలు పెరిగే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని రైతులకు సూచించారు. మండలంలో సాయింత్రం 5గంటల వరకు 60.4 మిల్లీలీటర్ల వర్షపాతం నమోదైనట్లు శివకోమలి తెలిపారు.

భీమిలిలో తుఫాను ప్రభావిత ప్రాంతాలను సందర్శించిన మంత్రి గంటా
భీమునిపట్నం, డిసెంబర్ 17: భీమిలి పరిధిలోని పెథాయ్ తుఫాను ప్రభావిత ప్రాంతాలను రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మంగళవారం సందర్శించారు. ఒక వైపు వర్షం కురుస్తున్నా మంత్రి తుఫాను ప్రభావిత ప్రాంతాలు, ముంపు గ్రామాలైన మంగమారిపేట, భీమిలి బీచ్ ప్రాంతాలను ఆయన సందర్శించారు. ముంపు ప్రాంతాల్లో ఉన్న వారిని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు తీసుకున్న ముందు జాగ్రత్త చర్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. భీచ్ ప్రాంతంలో ఎటు