విశాఖపట్నం

గుంటూరులో ఈ నెల 19న మాజీ సైనికుల ర్యాలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 17: ఈ నెల 19వ తేదీన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు గుంటూరు శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిర్ ఆడిటోరియంలో మాజీ సైనికుల ర్యాలీ ఉంటుంది. త్రివిధ దళాల్లో పనిచేసే వారికి సంబంధించి ఇటీవల అమల్లోకి వచ్చిన పలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అంశాలుంటాయి. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ దళాలకు చెందిన పథకాల అందుబాటులో ఉండే విషయాలను ఈ ర్యాలీ తెలియజేయడం జరుగుతుంది. 1ఇఎంఇ సెంటర్ హైదరాబాద్ చెన్నై దక్షిణభారత్ ఏరియా ఆధ్వర్యంలో సేనా మెడల్, విశిష్ట సేవామెడల్, లెఫ్ట్‌నెంట్ జనరల్ ఎస్.టి ఉపసాని అధ్యక్షతన ఇది జరుగనుంది. తెలంగాణా, ఆంధా జనరల్ ఆఫీసర్ కమాండింగ్ మేజర్ జనరల్ ఎన్.శ్రీనివాసరావు, సబ్ ఏరియా బ్రిగ్ సందీప్ భల్లా ఇందులో పాల్గొంటారు. అలాగే డైరెక్టర్ సైనిక్ వెల్ఫేర్ (ఏపీ) తదితర ప్రముఖులు ఈ ర్యాలీకి హాజరవుతారు. మిలటరీ ఆసుపత్రి, రికార్స్ ఆఫీసులు, జాతీయ బ్యాంకులు, జిల్లా సైనిక్ బోర్డు, ఈసీహెచ్‌ఎస్‌లకు సంబంధించిన స్టాళ్ళు ఈ సందర్భంగా ఏర్పాటు చేయనున్నారు.