విశాఖపట్నం

త్రోబాల్ పోటీల రన్నరప్ శ్రీ చైతన్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆరిలోవ, ఫిబ్రవరి 6: భారతీయ విద్యా భవన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జిల్లా త్రోబాల్ టోర్నీలో ఎంవీపీ శ్రీ చైతన్య పాఠశాల రన్నరప్‌గా నిలిచి ట్రోఫీ కైవసం చేసుకుంది. ట్రోఫీ సాధించిన విద్యార్థులను పాఠశాల ఉత్తరాంధ్ర సంచాలకులు (ఏజీఎం) సురేష్ బుధవారం అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువులోనే కాకుండా క్రీడల్లో సైతం రాణించాలన్నారు. క్రీడలు శారీరక దారుఢ్యానికి, మానసిక వికాసానికి దోహదపడతాయన్నారు. క్రీడల్లో మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులు ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు. కార్యక్రమంలో ఉత్తరాంధ్ర అకడమిక్ సమన్వయ కర్త రాజేష్, ప్రాంతీయ సంచాలకులు ఆశిబాబు, ప్రిన్సిపాల్ గోవిందరాజు, డీన్ రామ్మోహన్, వైస్ ప్రిన్సిపాల్ రవి ప్రసాద్, అధ్యాపక బృందం పాల్గొన్నారు. సహచర విద్యార్థులు తమ తోటి విద్యార్థులు సాధించిన ఘన విజయానికి గుర్తుగా సంబరాలు చేసుకున్నారు.